- రాయబరేలి నుంచి బరిలోకి దిగనున్న రాహుల్
- అమేథీలో కాంగ్రెస్ సన్నిహితుడు శర్మ పోటీ
- రాయబరేలి, అమేఠీలలో కాంగ్రెస్ నామినేషన్లు
- రాయబరేలి నుంచి రాహుల్ నామినేషన్ దాఖలు
- హాజరైన సోనియా, ప్రియాంక, మల్లికార్జున ఖర్గే
- అమేఠీలో నామినేసన్ వేసిన కిషన్ లాల్ శర్మ
ఉత్తరప్రదేశ్లోని రాయబరేటి, అమేఠీ సీట్లపై ఉత్కంఠకు తెరపడిరది. సోనియా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లడంతో రాయబరేలి నుంచి ఇప్పుడు ఆమె తనయుడు రాహుల్ రాయబరేలిలో పోటీకి దిగబోతున్నారు. ఇకపోతే అమేఠీలో గత సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు అక్కడ కాంగ్రెసేతర నేత కిశోరీలాల్ శర్మను బరిలోకి దింపింది. ఈ రెండు సీట్ల అభ్యర్థలను కాంగ్రెస్ ప్రకటించింది. దిల్లీ పీఠం దక్కించుకోవాలంటే ఎవరైనా సరే 80 పార్లమెంట్ స్థానాలున్న ఉత్తరప్రదేశ్పై పట్టు సాధించాల్సిందే. ఈ క్రమంలో కాంగ్రెస్ కూడా ఇక్కడ తాను ఏమాత్రం తగ్గకూడదని నిర్ణయించుకొంది. ప్రత్యర్థులు తమపై చేస్తున్న ప్రచారానికి చెక్పెడుతూ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా స్థానాన్ని నిలబెట్టుకొనేందుకు రాయ్బరేలీలో పోటీచేసేందుకురంగంలోకి దిగారు. 1952 నుంచి రాయ్బరేలీ నియోజకవర్గం గాంధీల కుటుంబానికి 38 ఏళ్లపాటు కంచుకోటగా నిలిచింది. తొలుత ఇక్కడి నుంచి ఇందిరా గాంధీ భర్త ఫిరోజ్ గాంధీ ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత ఇందిరా 1967 నుంచి 1980 వరకు ఇక్కడి నుంచి పోటీచేశారు. 1977లో మినహా అన్ని సార్లూ ఆమె విజయం సాధించారు. 1971 ఎన్నిక వివాదాస్పదం కావడంతో ఆమెకు వ్యతిరేకంగా కోర్టు తీర్పు వచ్చింది. ఆ తర్వాత ఎమర్జెన్సీ విధించారు. అనంతరం నిర్వహించిన ఎన్నికలో జనతాపార్టీ అభ్యర్థి రాజ్నారాయణ్ చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఎన్నికల్లో రాయ్బరేలీ, మెదక్ల నుంచి పోటీ చేసి గెలిచినా.. చివరి వరకూ మెదక్ స్థానానికి పరిమితమయ్యారు. ఇక సోనియా గాంధీ 2004 నుంచి వరుసగా ఇక్కడ విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా వ్యక్తిగత కారణాల రీత్యా రాజస్థాన్ నుంచి రాజ్యసభకు వెళ్లారు. దీంతో తన తల్లి ఖాళీ చేసిన స్థానంలో ఇప్పుడు రాహుల్ బరిలో నిలిచారు. 1952`2019 వరకు ఇక్కడ కాంగ్రెస్ కేవలం మూడు సార్లు మాత్రమే ఓడిపోయింది. తాజాగా రాయ్బరేలీ నుంచి భాజపా టికెట్పై బరిలో నిలిచిన దినేశ్ సింగ్ 2018 వరకు గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుల్లో ఒకరు. ఆయన కుటుంబం ’పంచవటి’గా కాంగ్రెస్లో సుపరిచితం. స్థానిక రాజకీయాల్లో ఆయన కుటుంబానికి బలమైన పట్టు ఉంది. బ్లాక్ చీఫ్, జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు ఆయన కుటుంబంలో ఉన్నారు. ఒకప్పుడు హస్తం పార్టీలో ’పంచవటి’ ప్రభావం ఎక్కువగానే ఉండేది. 2010, 2016లో దినేశ్ కాంగ్రెస్ టికెట్పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2018లో పార్టీని వీడి భాజపాలో చేరారు. ఆ మరుసటి సంవత్సరమే సోనియాపై పోటీ చేశారు. దాదాపు 1.6 లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. కానీ, భాజపా అగ్ర నాయకత్వం ఆయన్ను ఇప్పటికీ నమ్మడానికి ఓ బలమైన కారణం ఉంది. 2014 ఎన్నికల్లో కమలం పార్టీకి ఇక్కడి నుంచి కేవలం 1.73 లక్షల ఓట్లు మాత్రమే వచ్చాయి. దినేశ్ రాకతో ఓట్ల సంఖ్య దాదాపు రెట్టింపై 3.67 లక్షలకు చేరింది. 2021లో రాయ్బరేలీ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడిరచడానికి ఆయన పరపతి, వ్యూహం బాగా ఉపయోగపడ్డాయి. 2024లో సోనియా నియోజకవర్గంపై తక్కువగా దృష్టిపెట్టడంతో తమకు గెలుపు సాధ్యమని భాజపా వర్గాలు భావిస్తున్నాయి. దీంతో ఆయనకు స్థానికంగా పట్టు సడలనీయకుండా ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చి గెలిపించింది. ఇప్పుడు యోగి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. మరోవైపు రాహుల్ రెండు నియోజకవర్గాల్లో పోటీ చేయడాన్ని కమలం పార్టీ ప్రచారానికి వాడుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మరోవైపు గత ఎన్నికల్లో రాహుల్ వయనాడ్లో ఘన విజయం సాధించారు. ఈ సారి కూడా ఆయన అక్కడ బరిలో నిలిచారు. ఆ ఎన్నికలు పూర్తయ్యే వరకూ యూపీలోని అమేఠీ, రాయ్బరేలీ నియోజకవర్గ అభ్యర్థిత్వాలపై హస్తం పార్టీ ఏ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రాహుల్ ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు మొగ్గు చూపడంతో ఆయన పేరు ఖరారైంది. ఇక అమేఠీని తమ కుటుంబ సన్నిహితుడైన కేఎల్ శర్మకు అప్పగించారు. గాంధీలు దిల్లీలో ఉన్న సమయంలో వారి తరఫున రాయ్బరేలీ, అమేఠీ నియోజకవర్గాల్లో కార్యక్రమాలను ఆయనే చక్కబెట్టేవారు.