- ఊర ముత్యాలమ్మ అమ్మవారి ఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలుగాలి..
- బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించేలా అమ్మవారిని వేడుకున్నా..
- సూర్యాపేటలోని తాళ్ళగడ్డలో ఘనంగా ఇంద్రవెల్లి ముత్యాలమ్మ బోనాల పండుగ వేడుకలు..
- ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి తొలి బోనం ఎత్తిన మంత్రి జగదీష్ రెడ్డి..
సూర్యాపేట : తెలంగాణ సంప్రదాయానికి ప్రతీక బోనాల పండుగ వేడుకలు అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి తెలిపారు. శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ఊర ముత్యాలమ్మ అమ్మవారిఆశీస్సులు ప్రతీ ఒక్కరికీ కలుగాలని మంత్రి ఆకాంక్షించారు. సూర్యాపేట తాళ్ళగడ్డలో కొలువైన శ్రీశ్రీశ్రీ ఇంద్రవెల్లి ముత్యాలమ్మ అమ్మవారికి భక్తులు బోనాలను సమర్పించారు. మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని, భైరు దుర్గయ్య నివాసం లో తొలి బోనం ఎత్తి అనంతరం ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.గ్రామదేవతలను తమ ఇంటి ఆడపడుచుగా భావించి పూజించే విశిష్టమైన సంప్రదాయం కేవలం తెలంగాణకే సొంతమన్నారు.బోనాల సమయం లో అమ్మవార్లు తమ పుట్టింటికి వస్తారని ప్రజలు విశ్వసిస్తారని అన్నారు.అమ్మవారి ఆశీస్సుల తో పాటు , ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో గత పాలకుల హయాం లో అభివృద్ధి కి నోచుకోని తాళ్ళగడ్డ ప్రాంతం బాంగారు గడ్డ గా మారిందని అన్నారు. శాంతి భద్రతల కు తోడు అభివృద్ధి లో ,వ్యాపారరంగాల్లో సూర్యాపేట దూసుకుపోతుందన్నారు. ప్రజలకు ఆయు ఆరోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలు ప్రసాదించి, పాడి పంటల తో తులతూగేలా చల్లని ఆశీస్సులు అందజేయాలని అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి దీవించేలా అమ్మవారిని వేడుకున్నట్లు మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమం లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్, గ్రంధాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మారిపెద్ధి శ్రీనివాస్ గౌడ్, చిరివెళ్ళ శభరి ,భైరు దుర్గయ్య గౌడ్, బైరు వెంకన్న గౌడ్,రాపర్తి శ్రీనివాస్ గౌడ్, కక్కిరేని నాగయ్య గౌడ్, బూర బాల సైదులు గౌడ్, అనంతుల యాదగిరి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
తప్పక చదవండి
-Advertisement-