No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

మాజీ కానిస్టేబుల్ శ్రీశైలం బీజేపీలో చేరిక..

తప్పక చదవండి
  • కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరిక..

హైదరాబాద్ : ఉద్యమ ఆకాంక్షలు నెరవేరటం లేదని ఆవేదనతో కానిస్టేబుల్ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈటల రాజేందర్ సమక్షంలో శామీర్పేటలోని ఈటల నివాసంలో బీజేపీలో గుమ్మడి శ్రీశైలం ముదిరాజ్ చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉద్యమం సమయంలో ఆంధ్రవాళ్ళతో దెబ్బలు తిని విధులు నిర్వహించిన కూడా, ప్రత్యేక రాష్ట్రం వచ్చినాక ఉద్యమకారులను పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విధులు నిర్వహిస్తున్న పోలీస్ లను చాలా కష్టాలు పెడుతున్నారు.. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఈ భారాసా ప్రభుత్వం చేస్తున్న ఆరాచకాలను, నియంత పాలనను గమనించి బిజెపి అధికారంలోకి వస్తే ప్రజలకు అనుకున్న ఫలితాలు చేకూరతాయి అని ఈ బిజెపి పార్టీలో చేరడం జరిగిందని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో రవీందర్ రెడ్డి, బాలకృష్ణ, లింగమూర్తి, లింగం, స్వామిలు కూడా పాల్గొనడం జరిగింది..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు