No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

‘‘జమిలి’’ అంటే అంత జంకెందుకు.. ?

తప్పక చదవండి
  • మోదీ ఛరిష్మా సునామీలో కేసీఆర్ కొట్టుకపోవడం ఖాయం
  • దేశద్రోహుల పార్టీని సంత్రుప్తి పర్చేందుకే కేసీఆర్ జాతీయ సమైక్యతా రాగం..
  • పబ్లిక్ గార్డెన్ లో కాదు…దారుస్సలాంలో ఉత్సవాలు జరుపుకోండి
  • కేసీఆర్ పాలనలో మంత్రులంతా డమ్మీలే… సలహాదారులే మంత్రులకంటే పవర్ పుల్
  • నిరుద్యోగులకు ఉద్యోగాల్లేవ్…. రిటైర్డైన ఇతర రాష్ట్రాల అధికారులకు కోట్ల జీతాలతో సలహాదారుల పదవులా?
  • 22 లక్షల మంది కౌలు రైతులకు నయాపైసా సాయం అందడం లేదు
  • సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే…
  • పీజీలు చేసినా ఉద్యోగాల్లేక అమెరికా, దుబాయ్ హోటళ్లలో కూలీలుగా పనిచేస్తున్నరు
  • రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇచ్చే స్తోమత లేక ఉద్యోగ విరమణ వయసు పెంచే దుస్థితికి చేరిన కేసీఆర్
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు 20 సీట్లకు మించి రావు…
  • కాంగ్రెస్ లో గెలిచినోళ్లంతా వెళ్లేది బీఆర్ఎస్ లోకే
  • యువకులారా… ఇంట్లో కూర్చుంటే రాష్ట్రం మరింత అథో:గతే
  • తెలంగాణ బలిదానాల స్పూర్తితో కేసీఆర్ ను గద్దె దించేదాకా పోరాడదాం రండి…
  • కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే….
  • బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
  • ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార
    దీక్షకు హాజరై సంఘీభావం తెలిపిన బండి సంజయ్

హైదరాబాద్ : ‘‘జమిలి’’ ఎన్నికలంటే కేసీఆర్ కుటుంబం వణికిపోతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఎద్దేవా చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మా ముందు కేసీఆర్ పాలన కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశద్రోహుల పార్టీని సంత్రుప్తి పర్చేందుకే కేసీఆర్ సెప్టెంబర్ 17 నాడు జాతీయ సమైక్యతా రాగం అందుకున్నారని విమర్శించారు. ‘‘ఆరోజు పబ్లిక్ గార్డెన్ లో కాదు…దారుస్సలాంలో ఉత్సవాలు జరుపుకోండి’’అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో మంత్రులంతా డమ్మీలే… సలహాదారులే మంత్రులకంటే పవర్ పుల్ అని విమర్శించారు.

బుధవారం రోజు ఇందిరాపార్క్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షకు బండి సంజయ్ హాజరై సంఘీభావం తెలిపారు. కవితక్క నిన్న కామాఖ్య దేవాలయానికి పోయి అందరూ నాశనం కావాలని పూజలు చేసి వచ్చిందట…కిషన్ రెడ్డి 24 గంటలు నిరాహార దీక్ష చేస్తే కేసీఆర్ మాత్రం చేసినవన్నీ దొంగ దీక్షలే… బాత్రూంలకు పోయి తాగి తిన్నడు… కిషన్ రెడ్డికి మందు తాగడు. నాన్ వెజ్ తినడు. నీ లెక్క దొంగ దీక్ష చేయరు.. ఎవరి మోసాలకు వ్యతిరేకంగా దీక్ష చేస్తున్నడో తెలుసుకోలేని మూర్ఖుడు కేసీఆర్.. ఆయన దుబాయ్ శేఖర్. విదేశాలకు పంపుతానని దొంగ పాస్ పోర్డుల పేరుతో మోసం చేసిన దొంగ కేసీఆర్. కిషన్ రెడ్డికి బీపీ, షుగర్ లేవు. టెన్షన్ ఉంది. నిరుద్యోగులకు న్యాయం చేస్తరా? లేదోనని టెన్షన్ ఉంది. తెలంగాణలో 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం భర్తీ చేయలేదు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో లక్షలాది మంది నిరుద్యోగులను రోడ్డున పడేసిండు. సీఎం కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే.. ఇచ్చిన హామీలేవీ అమలు చేయడు. ఉద్యోగాల్లేక మురళీ ముదిరాజ్ వంటి వారు యూనివర్శిటీలోనే సూసైడ్ చేసుకున్నా, వందలాది మంది యువత చనిపోతున్నా పట్టించుకోవడం లేడు. తిండికి లేక పస్తులుండి, అప్పులు చేసి పిల్లలను చదివించిన తల్లిదండ్రులు… వాళ్లకు ఉద్యోగాలు రావడం లేదని తెలిసి తీవ్రమైన మనస్థాపానికి గురవుతున్నారు. అయినా కేసీఆర్ పట్టించుకోరు. నిన్న న్యూజెర్సీ నుండి వచ్చిన.. అక్కడ యువకులు రెస్టారెంట్లో మాస్క్ వేసుకుని హోటల్ లో సర్వర్ పనులు చేసుకుంటున్నరు. వాళ్లంతా తెలంగాణ వాళ్లే. తెలంగాణలో ఉద్యోగాల్లేక ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నమని, తల్లిదండ్రులు బాధ పడతారని సాఫ్ట్ వేర్ ఉద్యోగాలు చేస్తున్నామని చెబితే బాధేసింది.

- Advertisement -

కేసీఆర్ చేతగానితనంవల్లే తెలంగాణ నిరుద్యోగులంతా దుబాయ్, మస్కట్ పోయి కూలీ పనులు చేసుకుంటూ నానా కష్టాలు పడుతున్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని ప్రవాస తెలంగాణ వాసులంతా కేసీఆర్ కు డబ్బులిచ్చి ఉద్యమంలో సాయపడితే… రాష్ట్రం వచ్చాక కూడా వాళ్ల బతుకులు మారలేదని, స్వదేశానికి వచ్చి బతికే పరిస్థితి లేదని బాధపడుతున్నరు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ ల గుమస్తా నౌకర్లు తప్ప తెలంగాణ ప్రాంతం వాళ్లకు ఒక్క పెద్ద నౌకరి కూడా లేదు… ఆంధ్ర ప్రాంతo వాళ్లకే పెద్ద పోస్టు లు ఇస్తున్నరు.. మా తెలంగాణ మాగ్గావాలే’’ అని లొల్లి పెట్టిన KCR ఇయాళ చేసిందేమిటి? ఇప్పుడు అదే సెక్రటేరియట్ లో మహారాష్ట్ర వాడిని తీసుకొచ్చి 18 లక్షల రూపాయలకు నౌకరి ఇచ్చిండు. బీహారోళ్లకు సీఎస్ సహా ముఖ్యమైన పదవులిస్తున్నడు. కోర్టు చివాట్లు పెట్టిన సోమేశ్ కుమార్ కు వీఆర్ఎస్ ఇప్పించి సీఎంకు చీఫ్ అడ్వయిజర్ గా పెట్టుకున్నడు. రిటైర్డైన వందలాది ఇతర రాష్ట్రాల వాళ్లకు వందల కోట్ల జీతభత్యాలిస్తూ సలహాదారులుగా పెట్టుకున్నడు. ఇయాళ కేసీఆర్ కేబినెట్ లోని మంత్రుల సంఖ్య కంటే సలహాదారుల సంఖ్యే ఎక్కువైంది. సలహాదారులే కేసీఆర్ కు అసలైన కేబినెట్ మంత్రులు… ఇప్పుడున్న మంత్రులంతా డమ్మీలే. కేసీఆర్ పాలనలో ఏ ఒక్క వర్గం సంత్రుప్తిగా లేదు. నానా ఇబ్బందులు పడుతున్నరు. జమిలీ ఎన్నికలంటేనే బీఆర్ఎస్ వణికిపోతోంది. నిన్న కేసీఆర్ కొడుకు, ఇయాళ అగ్గిపెట్టె మంత్రి అవాకులు పేలుతున్నరు. నేనడుగుతున్న జమిలీ ఎన్నికల పేరు వింటేనే మీరెందుకంత ఉలిక్కిపడుతున్నరు. జమిలీ ఎన్నికలొస్తే నరేంద్రమోదీగారి ఛరిష్మా ముందు నీది, మీ అయ్య ఛరిష్మా దేనికీ పనికిరాదనే భయమా? మోదీ సునామీలో బీఆర్ఎస్ బంగాళాఖాతంలో కొట్టుకుపోతుందనే వణుకు పుడుతుందా? అయినా అంత తొందరెందుకు? కొద్ది రోజులు ఆగితే కేంద్రం స్పష్టత ఇస్తుంది కదా? గుమ్మడి కాయలు దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఎందుకు ఉలిక్కిపడుతున్నవ్? జమిలీ ఎన్నికలకు, హిందూ ముస్లింల మధ్య కొట్లాకు సంబంధమేందో అగ్గిపెట్టె మంత్రి సమాధానమివ్వాలి. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల అరాచకాల చెర నుండి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న సెప్టెంబర్ 17 యావత్ తెలంగాణ ప్రజలకు విమోచన దినం…. కానీ సీఎం కేసీఆర్ కు, ఆయన దత్త పుత్రుడు ఒవైసీకి మాత్రం ఆరోజు జాతీయ సమైక్యతా దినమట. అధికారికంగా ఆరోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున జాతీయ సమైక్యతా దినోత్సవాలు జరుపుతారట. ఏటా సెప్టెంబర్ 17న విద్రోహ దినంగా భావిస్తూ నల్ల జెండాలు ఎగరేసే ఎంఐఎం నాయకులు ఈసారి జాతీయ సమైక్యతా దినోత్సవం పేరుతో పాతబస్తీలో పెద్ద ఎత్తున ర్యాలీలు తీస్తరట… నేనడుగుతున్న ఎవడి సమైక్యత? ఎవడికి సమైక్యతా దినోత్సవం? బీఆర్ఎస్, ఎంఐఎం స్నేహానికి గుర్తుగా జరుపుకునే దినోత్సవమా జాతీయ సమైక్యతా? కేసీఆర్…. పబ్లిక్ గార్డెన్ లో జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించడమెందుకు?…. మీ ఇద్దరి స్నేహానికి గుర్తుగా దారుస్సలాంలో జెండా ఎగరేసి ఉత్సవాలు చేసుకోండి… సిగ్గుండాలే… పాతబస్తీలో సెప్టెంబర్ 17న నల్లజెండాలు ఎగిరేసిన సంగతి కేసీఆర్ మర్చిపోయిండా? నిజాం, రజాకార్ల అరాచకాలకు బలైపోయిన తెలంగాణ బిడ్డల మానప్రాణాలు గుర్తుకు రావడం లేదా? ఆనాటి సంఘటనలకు గుర్తుకొస్తే ఈరోజుకు కూడా తెలంగాణ బిడ్డల రక్తం మరుగుతోంది. తొలిదశ, మలిదశ తెలంగాణ పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చినా…. నేటికీ యువతకు ఉద్యోగాలివ్వలేని దుస్థితిలో కేసీఆర్ ఉన్నడు. ఉద్యోగులు రిటైర్డ్ అయితే బెన్ ఫిట్స్ ఇచ్చేందుకు డబ్బుల్లేక ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంచి నిరుద్యోగుల పొట్టకొట్టిండు.. కేసీఆర్ మళ్లీ నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి… ఉద్యోగాల ప్రకటన పేరుతో మళ్లీ అదికారంలోకి రావాలని చూస్తున్నడు… ప్రజలు నిరుద్యోగుల మాటలను నమ్మొద్దు.. పరీక్షలు నిర్వహించలేని, నోటిఫికేషన్లు వేయలేని, మహిళలను, నిరుద్యోగులను, రైతులను ఆదుకోని కేసీఆర్ ఎట్లా అధికారంలోకి వస్తుందో చెప్పాలి?

నిరుద్యోగుల గోస తీరాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే. కొలువులు కావాలంటే కమలం రావాల్సిందే… కేసీఆర్ దుష్ట పాలనపై పోరాడి జైలుకు వెళ్లిన పార్టీ బీజేపీ. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే. రెండూ కలిసి నాటకాలాడుతున్నయ్. ఈ రెండు పార్టీలకు 20 సీట్లకు మించి రావు… కాంగ్రెస్ పార్టీకి 10 సీట్లకు మించి రావు.. పొరపాటున కాంగ్రెస్, బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే.. యువతకు ఉద్యోగాలు రావు. అందరూ అరిగోస పడాల్సిందే… దయచేసి కేసీఆర్ పాలనకు, మోదీ పాలనకు ఉన్న తేడాను బేరీజు వేయాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా. మోదీ పాలనలో రోజ్ గార్ మేళా కింద 10 లక్షల ఉద్యోగాలకు నియామక పత్రాలు కూడా అందించిన సంగతిని గుర్తుంచుకోవాలి. నిరుద్యోగులు, ఉద్యోగులే కాదు చదువుకుంటున్న పేద విద్యార్థులను కూడా వేధిస్తున్నడు. కాలేజీలకు ఫీజ్ రీయంబర్స్ మెంట్ చెల్లించకుండా ముప్పు తిప్పలు పెడుతున్నడు. ఫీజు రీయంబర్స్ మెంట్ చెల్లించకపోవడంతో విద్యార్థులు చదువు మానేసి కూలీ పని చేసుకునే దుస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో పొరపాటున బీజేపీ అధికారంలోకి వస్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయ్…జమిలీ ఎన్నికలొచ్చినా…రాకపోయినా… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండానే… రాబోయేది రామరాజ్యమే… ఏర్పడేది బీజేపీ ఆధ్వర్యంలోని పేదల రాజ్యమే…కిషన్ రెడ్డిగారి నాయకత్వంలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు మీరంతా సమయం ఇవ్వాలని, ఉద్యమానికి ముందుకు రావాలని కోరుతున్నా. నిరాశ పడితే నష్టపోయేది యువతే. దయచేసి యువత నిరాశ పడొద్దు. మీరు ఇంట్లో కూర్చుంటే పనికాదు… మళ్లీ కేసీఆర్ పాలన వస్తే అప్పుడు రాష్ట్రం సర్వనాశమైతదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాంగ్రెస్ గెలిచినా మళ్లీ వాళ్లంతా వెళ్లేది బీఆర్ఎస్ లోకే. కేసీఆర్ మోసాలకు అంతుండదు. అందుకే శ్రీకాంతాచారి, ఇషాంత్ రెడ్డి, సుమన్, పోలీస్ కిష్టయ్యవంటి యువకుల బలిదానాలను స్మరించుకోండి… వారి స్పూర్తితో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించేదాకా పోరాడదాం రండి… కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కాషాయ జెండా పట్టుకని జై తెలంగాణ అంటూ కేసీఆర్ నయా రజాకార్ పాలనను కూకటి వేళ్లతో పెకిలించి వేయాలి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు