Thursday, September 19, 2024
spot_img

పార్టీ టికెట్ ఎవరికీ కేటాయించిన కలిసి పని చేస్తాం..

తప్పక చదవండి

మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు అందరూ పార్టీకి కట్టుబడి ఉంటారు

షాద్ నగర్ : అభ్యర్థుల ప్రకటనలతో నాయకులు, కార్యకర్తలు ప్రచార జోరును పెంచారు. గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లి.. అధికారంలోకి వస్తే పాలన ఎలా ఉంటుందో వివరిస్తున్నారు. ప్రచార రథాలతో జనాల్లోకి వెళుతున్న అభ్యర్థులు.. మరోసారి అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం బీజేపీ కార్యవర్గ సభ్యులు అందే బాబయ్య తన ప్రచార రథాలను షాద్నగర్ లోని ఎ బి కాంప్లెక్స్ సమీపంలో జెండా ఊపి తన ప్రచార రథాలను మొదలుపెట్టారు మీడియా ను ఉద్దేశించి అందె బాబాయ్య మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తమ తమ ప్రచారాలను మొదలుపెట్టి ఆయా పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయని బీజేపీ కార్యకర్తలు ఎవరు నిరుత్సాహపడకుండా బీజేపీ ప్రచార రథాలను ప్రారంభించామని అన్నారు.

- Advertisement -

అటు బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి కూడా తన ప్రచార రథాలను మొదలు పెట్టడం జరిగిందని అన్నారు మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ బీజేపీ నాయకులు పాలమూరు విష్ణు వర్ధన్ రెడ్డి,మరియు శ్రీ వర్ధన్ రెడ్డి, మిథున్ రెడ్డి మేమందరం ఒకటేనని మా మధ్య ఎలాంటి విభేదాలు లేవని పార్టీకి కట్టుబడి ఉన్నామని పార్టీ ఎవరికి టికెట్ కేటాయించిన అందరం కలిసి పని చేస్తామని మా నలుగురు మధ్యలో ఎలాంటి విభేదాలు లేవని అన్నారు ఈ ఎన్నికలలో కలిసికట్టుగా పనిచేసి షాద్నగర్ లో మా బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటామని బీజేపీ జెండా ఎగురవేస్తామని అన్నారు

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు