Thursday, October 24, 2024
spot_img

బీజేపీ పాలనలోనే అన్నీ వర్గాల ప్రజలకు న్యాయం

తప్పక చదవండి
  • కౌన్సిలర్ హంసారాణి కృష్ణ గౌడ్

మేడ్చల్ : రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి ఓస్తేనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్రంలోని ప్రజల భవిష్యత్తు బాగుపడుతుంది అని మేడ్చల్ మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ బీజేపీ కౌన్సిలర్ సముద్రాల హంసారాణి కృష్ణ గౌడ్ అన్నారు. మంగళవారం
గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న కండ్లకొయ్య గ్రామ పదవ వార్డ్ లో మేడ్చల్ నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు గుర్తుకి ఓటు వేసి ఎమ్మెల్యే అభ్యర్థి ఏనుగు సుదర్శన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న కౌన్సిలర్ సముద్రాల హంస కృష్ణగౌడ్ ఓటర్లను కోరారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఒక్క అవినీతి లేని ప్రధాని మోదీ వెంట మేమున్నాం అని, ప్రస్తుతం మన మేడ్చల్ జిల్లాలో ఎంపి హోదాలో కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే హోదాలో బీఆర్ఎస్ పార్టీ పాలన ఏవిధంగా ఉందో చూస్తున్నాం అని అన్నారు. ఈ రెండు పార్టీల నియంతృత్వ పాలన రజాకార పాలనను అనుభవిస్తున్న మేడ్చల్ జిల్లా ప్రజలు అని ఆరోపించారు. కేంద్రంలోని ప్రధాని మోదీ పాలన ఫలితాలు పారదర్శకంగా మేడ్చల్ జిల్లా ప్రజలకు అందాలి అంటే స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే గెలవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది అన్నారు. మనం ప్రతి ఉదయం సూర్యోదయం చూడడం ఎంత ముఖ్యమో, మనం బ్రతకడానికి శ్వాస తీర్చుకోవడం ఎంత ముఖ్యమో, అంతే ముఖ్యంగా కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి సుదర్శన్ రెడ్డిని గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణ గౌడ్, వై అర్జున్, బాబు, బి. మల్లేష్ , సత్యనారాయణ, అశోక్, బాలకృష్ణ, శ్రీనివాస్, నవీన్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు