సోచి : జూన్ నుంచి ఇప్పటి వరకు ఉక్రెయిన్ 90 వేల మంది సైనికుల్ని కోల్పోయినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ తెలిపారు. సోచిలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 557 యుద్ధ ట్యాంకులు, 1900 యుద్ధ వాహనాలను కూడా ఆ దేశం కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఖేర్సన్, డోనస్కీ ప్రాంతాల్లో జూన్ 4వ తేదీ నుంచి ఎదురుదాడి ప్రారంభమైంది. జపరోజి వద్ద ఉక్రెయిన్ దళాలు కొన్ని ప్రాంతాలను చేజిక్కించుకున్నా.. చాలా వరకు సిబ్బందిని కోల్పోయింది. ఉక్రెయిన్కు సరఫరా అయిన పశ్చిమ దేశాల ట్యాంకులను రష్యాకు చెందిన డ్రోన్లు, క్షిపణులు ధ్వంసం చేశాయి. కేవలం సెప్టెంబర్లోనే సుమారు 17 వేల మందిని ఉక్రెయిన్ కోల్పోయినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. యుద్ధం ప్రారంభమైన 9 నెలల్లోనే సుమారు లక్ష మందిని ఉక్రెయిన్ కోల్పోయినట్లు యురోపియన్ యూనియన్ ఓ రిపోర్టులో పేర్కొన్నది.