- హెచ్ఎల్సీకి నీటి కేటాయింపుల్లో అన్యాయం
- కర్టాటకతో మాట్లాడి నీరు విడుదల చేయాలి
- ఎస్ఇని కలిసి వినతిపత్రం సమర్పించిన జేసీ
అనంతపురం : వైసీపీ ప్రభుత్వం రైతుల పొట్టకొడుతోందని మాజీ ఎంపీ జేసీ దివాకర్రెడ్డి అన్నారు. ఈ విధానాలను ఇలాగే కొనసాగిస్తే ఇక్కడ ఇరైతులు సేద్యం చేసుకోవడం కష్టమేనని అన్నారు. కర్నాటకనుంచి రావాల్సిన నీటి వాటాను అడగడంలో వైసిపి ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.హెచ్ఎల్సీకి రావాల్సిన నీటి కేటాయింపులపై శుక్రవారం నాడు ఎస్.ఈ రాజశేఖర్ను కలిసి సమస్యను విన్నవించారు. ఈ సందర్భంగా జేసీ దివాకరరెడ్డి విూడియాతో మాట్లాడుతూ…హెచ్చెల్సీ కాలువల్లో నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జలవనరుల శాఖ అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. నీరు లేకపోతే ఇసుక అమ్ముకోవచ్చని జగన్రెడ్డి ప్రభుత్వం ఎª`లాన్ చేస్తోంది. ఇసుక ద్వారా వచ్చే ఆదాయం కోసం వైసీపీ నేతలు రైతులను నాశనం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని నీరు అడగడం లేదు. వేసిన పంటల్లో పెట్టుబడి కూడా రైతులకు రావడం లేదు. రైతులు అప్పులు చేసి పంటలు వేశారు. వర్షాలు పడినప్పుడు ఉన్న నీరుని పై అధికారులు చెప్పితేనే నీళ్లు వదిలామని ఇక్కడి అధికారులు చెబుతున్నారు. టీడీపీ హయాంలో అధికారులతో విూటింగ్ పెట్టుకొని మాట్లాడేవాళ్లం.. కర్ణాటక ప్రభుత్వంతో సమావేశం ఏర్పాటు చేసి నీరు వచ్చేలా అధికారులతో మాట్లాడేవాళ్లం. నేను రాజకీయంగా అడగడం లేదు.. ఎన్నికల్లో నిలబడటం లేదు.. రైతుల అవస్థలు చూసి అధికారుల వద్దకు వచ్చా. సీఎం జగన్మోహన్రెడ్డికి నీటి సమస్యను తీసుకెళ్లే నాయకుడు వైసీపీలో లేరు. తాము అధికారంలో ఉన్నపుడు సీఎంకి నేరుగా చెప్పి రైతుల సమస్యలు పరిష్కరించేవాళ్లం. రైతుల కోసం వారు పడుతున్న ఇబ్బందులు చూసి నడవడానికి శక్తి లేకపోయినా అధికారుల వద్దకు వచ్చా‘ అని జేసీ దివాకర్రెడ్డి పేర్కొన్నారు.