Friday, October 18, 2024
spot_img

మనోహరాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్

తప్పక చదవండి
  • ఈటల సమక్షంలో బీజేపీలో చేరిన పలు గ్రామాల సర్పంచ్ లు

మనోహరాబాద్ : మనోహరబాద్ మండలంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండలంలో భారీ సంఖ్యలో ప్రజాప్రతినిధులు ఈటల సమక్షంలో బీజేపీ పార్టీలో చేరారు. ఆదివారం మండలంలోని మేజర్ గ్రామ పంచాయతీ కాళ్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ ఆధ్వర్యంలో కొనాయిపల్లి, కొండాపూర్, కుచారం సర్పంచ్ లు ప్రభావతి నర్సింలు, మమత రవి, నరేందర్ రెడ్డి, జీడిపల్లి గ్రామ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చంద్రశేఖర్ లు భారీ సంఖ్యలో పాలకవర్గం సభ్యులు, ఆయా గ్రామాల పాలకవర్గం సభ్యులు బీజేపీలో చేరారు. అగ్రహారం పాలకవర్గం సభ్యులు, జడ్పీ చైర్మన్ అనుచరులు తెలంగాణ ఉద్యమకారుడు ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పాలట పాండు పలువురితో కలిసి ఈటల సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో రామ్మోహన్ గౌడ్, సాయిబాబా, నందన్ గౌడ్, నరేందర్ చారి, గుమ్మడి శ్రీను భారీ సంఖ్యలో బీజేపీ కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు