Thursday, September 19, 2024
spot_img

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు

తప్పక చదవండి

మేడ్చల్ : ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు మంగళవారం మేడ్చల్ లో ఘనంగా జరిగాయి. మేడ్చల్ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డ్ అర్చన కాలనీలో గల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పలువురు నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయ సాధన ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేసేందుకు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో అర్చన కాలనీ సేవాసమితి అసోసియేషన్ అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, కాంగ్రెస్ మండల ప్రెసిడెంట్ గౌడవెల్లి రమణ రెడ్డి, మురళి గౌడ్, బీజేపీ మేడ్చల్ మున్సిపల్ అధ్యక్షులు కొండం ఆంజనేయులు, నాయకులు వేముల సత్యనారాయణ రెడ్డి, డి సురేందర్ రెడ్డి, జి మధుసూదన్ రెడ్డి, డి రామచంద్ర రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, వంశీ, ప్రేమ్ దాస్, హరిబాబు రెడ్డి, అర్జున్, రాజు, కాలనీవాసులు బుచ్చి రాములు, సుధాకర్ చారి, హనుమంత రెడ్డి, మోహన్ గౌడ్, మన్మధరావు, కమలాకర్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు