No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

బీఆర్ఎస్ పార్టీ మాయా మాటలు ప్రజలు నమ్మరు

తప్పక చదవండి
  • స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిరా

స్టేషన్గన్పూర్ : తెలంగాణాలో బీఆర్ఎస్ పార్టీ మాయా మాటలు ప్రజలు ఇక నమ్మరని స్టేషన్ ఘన్పూర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర అన్నారు. శనివారం లింగాల ఘనపూర్ మండలం పరిధిలోని మనిక్యపురం గ్రామం లో గడపగడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో స్థానిక ప్రజానీకానికి కాంగ్రెస్ పార్టీ హయాంలో అధికారంలో ఉన్నప్పుడు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలలో పెద్దపీట వేసినట్లే రానున్న రోజులలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సంక్షేమ పథకాలకు అమలు చేస్తామని గ్రామ ప్రజానీకానికి తెలియజేశారు. హైదరాబాద్ లో సోనియా గాంధీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు నియోజకవర్గంలోని గడపగడపకు తిరుగుతూ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగానే అమలయ్యే సంక్షేమ పథకాలను, అదేవిధంగా సోనియమ్మ ప్రకటించిన 6 గ్యారెంటీలను ప్రజలకు వివరించారు.

  1. మహాలక్ష్మి
    మహిళలకు ప్రతి నెల రూ.2,500,
    రూ.500 కే గ్యాస్ సిలిండర్,
    ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం.
  2. రైతు భరోసా
    ప్రతి ఏటా రైతులు, కౌలు రైతులకు రూ.15,000,
    వ్యవసాయ కూలీలకు రూ.12,000,
    వరి పంటకు రూ.500 బోనస్.
    3 గృహ జ్యోతి
    ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్.
  3. ఇందిరమ్మ ఇండ్లు
    ఇల్లు లేని వారికి ఇంటి స్థలం & రూ.5 లక్షలు,
    ఉద్యమకారులకు 250 చ.గ ఇంటి స్థలం.
  4. యువ వికాసం
    విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు,
    ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషన్ స్కూల్స్.
  5. చేయూత
    రూ.4,000 నెలవారీ పింఛను,
    రూ. 10 లక్షల రాజీవ్ ఆరోగ్య భీమా.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల అధ్యక్షులు మండల అనుబంధ సంఘాల అధ్యక్షులు మండల శ్రీ నాయకులు మహిళా నాయకురాలు యువజన నాయకులు గ్రామ శాఖ అధ్యక్షులు యువజన నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు