Saturday, September 21, 2024
spot_img

సికింద్రాబాద్‌లో పద్మారావు గౌడ్‌ను ఓడించాలి

తప్పక చదవండి
  • సీపీఐ సికింద్రాబాద్‌ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్‌

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నియోజక వర్గ ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని బ్రష్టు పట్టించిన బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్‌ ను రానున్న ఎన్నికల్లో ఓడించాలి. సిపిఐ సికింద్రాబాద్‌ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయలేని పద్మరావు గౌడ్‌ కు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదన్నారు. మంగళవారం బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పద్మారావు గౌడ్‌ ను ఓడిరచా లని అడ్డగుట్ట డివిజన్‌ పరిధిలోని తుకారాంగేట్‌ వద్ద సిపిఐ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంపల్లి శ్రీనివాస్‌ మాట్లా డుతూ గడిచిన పదేళ్లలో నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని పేర్కొన్నారు. డ్రైనేజీ, కలుషిత జలా లు, ఇరుకైన రోడ్లతో ప్రజలు నిత్యం అవస్థలు పడుతున్నారని చెప్పారు. గడిచిన పది ఏళ్లలో పద్మారావు తన కొడుకులను నాలుగు డివిజన్లకు షాడో కార్పోరేటర్లుగా నియమించి సెటిల్మెంట్లు, దందాలతో ఆస్తులు కూడపెట్టు కున్నారని మండిపడ్డారు. అడ్డగుట్ట డివిజన్‌ లో కనీసం మంచినీటి సమస్య తీర్చలేకపోయాడని మండిపడ్డారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌, దళిత, బీసీ, మైనార్టీ బందులన్ని అర్హులైన పేద వర్గాలకు కాకుండా సొంత పార్టీ పైరవీకారులకు నాయకులకు ఇచ్చాడని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో ప్రజలే పద్మారావుకు బుద్ధి చెప్తారని, ఆయనకు ఓటమి తప్పదని హెచ్చరించారు. సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా కృషిచేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని ఓడిరచాలని సూచిం చారు. కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఉమరా?న్‌, కొమరెల్లిబాబు, పాకాలయాదగిరి, తోకలసోమయ్య, షేక్‌ లతిఫ్‌, రషీద్‌,గౌరీనాగరాజ్‌, మల్లేష్‌, రంజిత్‌ సింగ్‌, ఖాజ మియా, శ్రీహరి, ఆంజనేయులు, లక్ష్మణ్‌,ఖాసిం,అంజి, రామస్వామి ,బాలరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు