Friday, October 18, 2024
spot_img

అభివృద్ధి పనులను ప్రారంభించిన పద్మారావు గౌడ్‌

తప్పక చదవండి

సికింద్రాబాద్‌ : సికింద్రాబాద్‌ నియోజకవర్గం లోని బౌద్దనగర్‌ డివిజన్‌ లో డిప్యూటీ స్పీకర్‌ తీగుల్ల పద్మారావు గౌడ్‌ విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు డివిజన్‌ లో రూ.4 కోట్లతో చేపడుతున్న వివిధ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక కార్పొరేటర్‌ కంది శైలజ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్‌ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారానికి తాము పాటు పడుతున్నామని అన్నారు. అభివృద్ధి లో సికింద్రాబాద్‌ ను రాష్ట్రంలో అగ్ర స్థానంలో నిలుపుతున్నామని తెలిపారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ల కేటాయింపును పారదర్శకంగా నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నేతలు కిషోర్‌ కుమార్‌, కంది నారాయణ, ఆంజనేయులు గౌడ్‌, పాలరాజు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు