- నీలం మధు ముదిరాజ్కి అనూహ్య సంఫీుభావం..
- నేటి ఎన్ఎంఆర్ యువసేన మహా పాదయాత్రతో కేసీఆర్కి దిమ్మదిరిగే సమాధానం చెబుతాం..
- ఈ కార్యక్రమాన్ని విజయవంతం చెయ్యాలని పిలుపు..
ప్రత్యేకించి కొంతమంది నాయకులే ప్రజా నాయకులు అవుతారు.. వారిలో అణువణువూ ప్రజలకు సేవ చేయాలనే తపన దాగి ఉంటుంది.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెరవక తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారు.. వీరు డబ్బులు పెట్టి ఓట్లు కొనరు.. కేవలం అభిమాన గణం సపోర్ట్ తోనే విజయాలు సాధిస్తారు.. అలాంటి కోవకే చెందుతారు నీలం మధు ముదిరాజ్..
హైదరాబాద్ : ఎన్ఎంఆర్ యువసేన వ్యవస్థాపకులు నీలం మధు ముదిరాజ్ ను పటాన్చెరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా ‘‘ నిలబెడుతున్నాం గెలిపిద్దాం ‘‘ అనే నినాదంతో చేపట్టే మహా పాదయాత్రను విజయవంతం చేయాలని ఎన్ఎంఆర్ సభ్యులు పిలుపునిచ్చారు. శుక్రవారం పటాన్చెరు మండలం చిట్కుల్ గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో యువసేన సభ్యులు వాల్ పోస్టర్ ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…నేటి ఉదయం పటాన్చెరు పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం నుండి బీరంగుడా మల్లికార్జున ఆలయం వరకు నీలం మధు ముదిరాజ్ ను ఎమ్మెల్యే అభ్యర్థిగా, బహుజన బిడ్డగా నిలబెట్టి గెలిపించుకుందామని మహా పాదయాత్ర నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ మహా పాదయాత్రకు పటాన్చెరు నియోజకవర్గం నుండి యువత భారీ సంఖ్యలో తరలిరావాలని ఎన్ఎంఆర్ పిలుపునిచ్చింది.
ప్రత్యేకించి కొంతమంది నాయకులే ప్రజా నాయకులు అవుతారు.. వారిలో అణువణువూ ప్రజలకు సేవ చేయాలనే తపన దాగి ఉంటుంది.. ఎన్ని అవరోధాలు ఎదురైనా వెరవక తమ కార్యక్రమాలను కొనసాగిస్తూ ఉంటారు.. వీరు డబ్బులు పెట్టి ఓట్లు కొనరు.. కేవలం అభిమాన గణం సపోర్ట్ తోనే విజయాలు సాధిస్తారు.. అలాంటి కోవకే చెందుతారు నీలం మధు ముదిరాజ్..