- వ్యవస్థాపకుడి గురించి పుస్తకం విడుదల
మైసూరు : కొనసాగుతున్న దసరా ఉత్సవాల మధ్య మైసూరు రాజవంశస్థుడు యదువీర కృష్ణదత్తా.. చామరాజ వడియార్ సైకిల్ వ్యవస్థాపకులు ఎన్. రంగా రావు గౌరవార్థం ఒక పుస్తకాన్ని, ప్రత్యేక పరిమిత ఎడిషన్ అగర్బత్తి ‘‘దర్బారి’’ ని విడుదల చేశారు. ఈ ప్రత్యేక కార్యక్రమంలో శ్రీయదు వీర్ కృష్ణ దత్త చామరాజ వడియార్ మాట్లాడుతూ.. మైసూరు అగర్బతి పరిమళం నేడు ప్రపంచఖ్యాతిని పొందిందని, అగర్బత్తికి జిఐ హోదా లభించిందని, ఇది చాలా కాలంగా మైసూరు అగర్బత్తి పరిమళాలకు నిదర్శనమన్నారు. రాజాస్థానాలు, దేవాలయాలు, మన ప్రజల గృహాలు, మన ఇంద్రియాలను ఉద్ధరిస్తూ, మనలను దైవానికి అనుసంధానం చేస్తాయి. మన సంప్రదాయాల యొక్క గొప్పవస్త్రాన్ని కాపాడుకోవడానికి మేము కట్టుబడి ఉన్నాము.. ఈ సువాసన కళలు కొనసాగేలా మేము మాహృదయ పూర్వక ప్రోత్సాహాన్ని కొనసాగిస్తాము. మా ప్రజలకు స్ఫూర్తి, గర్వకారణం అన్నారు..