నాగర్ కర్నూల్ : బట్టలు ఉతకడానికి చెరువుకు వెళ్లిన తల్లీకూతుళ్లు మృతి చెందారు. ఈ ఘటన నాగర్కర్నూల్ మున్సిపాలిటీ పరిధిలోని నాగనోలు గ్రామంలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్తే.. నాగనోలు గ్రామానికి చెందిన నారమ్మ(55), ఆమె కూతురు సైదమ్మ(37) శనివారం బట్టలు ఉతకడానికి సవిూపంలోని చెరువులోకి వెళ్ళగా ప్రమాదవశాత్తు చెరువులో పడ్డారు. గమనించిన స్థానికులు కాపాడే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయింది. ఆదివారం వారి మృతదేహాలను వెలికి తీశారు. సైదమ్మ భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.