Friday, September 20, 2024
spot_img

కస్టమర్ ఎక్స్‌ పీరియన్స్ సెంటర్‌ను ప్రారంభించిన మినోషా

తప్పక చదవండి

వ్యాపార విజయం అనుకూలత, వినూత్నతలపై ఆధారపడిన ప్రపంచంలో, నేటి సవాళ్లు, రేపటి అవకాశాల కోసం రూపొందించబడిన డిజిటల్ కలర్ ప్రెస్ అయిన రికో ప్రో సి9500, రికో ప్రో సి7500లను మినోషా ఇండియా లిమిటెడ్ సగర్వంగా పరిచయం చేసింది. ఈ తదుపరి తరం వ్యవస్థ దాని అధు నాతన సాంకేతికతలు, ఆటోమేషన్, అగ్రశ్రేణి నాణ్యతతో కొత్త శిఖరాలను చేరుకోవడానికి వ్యాపారాలను శక్తి వంతం చేస్తుంది. మినోషా కస్టమర్ ఎక్స్‌ పీరియన్స్ సెంటర్ ప్రారంభోత్సవ సమయంలోనే ఈ ఆవిష్కరణలు చోటు చేసుకోవడం ఓ విశేషం. ఇది కస్టమర్‌లకు ఈ ఉత్పత్తుల గురించి లోతైన జ్ఞానాన్ని పొందడానికి, కొత్త ఆఫర్‌లను ఉపయోగించి వారు అన్వేషించడానికి ఉద్దేశించిన వివిధ అప్లికేషన్‌లను ప్రత్యక్షం చూసి తెలుసు కోవడంలో పాల్గొనడానికి కేంద్రంగా ఉపయోగ పడుతుంది. కస్టమర్ ఎక్స్‌ పీరియన్స్ సెంటర్ ను అత్యా ధునిక డిజైన్‌లో సందర్శకులు ఈ మెషీన్‌ల లక్షణాలను పూర్తిగా తెలుసుకోడానికి అవసరమైన అన్ని సౌకర్యాలతో అమర్చారు. ఈ సందర్భంగా మినోషా ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ అతుల్ థక్కర్ మాట్లాడుతూ, “పరివర్తన ముద్ర ణ యుగం అంచున ఉన్న సమయంలో, రికాహ్ ప్రో సి9500, రికో ప్రో సి7500 కేవలం ప్రింటర్లు కాదు; అవి పెట్టు బడులు. మీ వ్యాపార భవిష్యత్‌లో మినోషా ఇండియా లిమిటెడ్, రికో మీ ప్రింటింగ్‌లో విప్లవాత్మకమైన ఉత్ప త్తులను పరిచయం చేయడం, సమర్థత, నాణ్యతను పెంచడం ఆనందాన్ని అందిస్తోంది. ఇవి డైనమిక్ బిజినెస్ ల్యాండ్‌స్కేప్‌లో అగ్రగామిగా నిలిచేందుకు మీకు ప్రవేశద్వారాల్లాంటివి. ఈ ఆవిష్కరణలతో మీరు మీ వ్యాపారం నిలకడగా సాగేందుకు పెట్టుబడి పెడుతున్నారు. మీతో ఈ పరివర్తన ప్రయాణంలో భాగం కావడానికి మేం సంతోషిస్తు న్నాం’’ అని అన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు