Thursday, September 19, 2024
spot_img

జ‌న‌గామ మెడిక‌ల్ కాలేజీ స్థ‌లాన్ని ప‌రిశీలించిన మంత్రి ఎర్ర‌బెల్లి..

తప్పక చదవండి

జ‌న‌గామ‌ : ఈ నెల 15వ తేదీన ఒకే రోజు రాష్ట్రంలోని 9 మెడిక‌ల్ కాలేజీల‌ను రాష్ట్ర ముఖ్య‌మంత్రి కల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ప్రారంభించ‌నున్న సంద‌ర్భంగా రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు జ‌న‌గామ మెడ‌కిల్ కాలేజీని సంద‌ర్శించి, ప‌రిశీలించారు. ఆనాటికి వేగంగా జ‌ర‌గాల్సిన ప‌నులపై మంత్రి ఆరా తీశారు. వేగంగా ప‌నులు నిర్వ‌ర్తించాల‌ని ఆదేశించారు. మంత్రి వెంట జ‌న‌గామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాద‌గిరి రెడ్డి, డాక్ట‌ర్ సుగుణాక‌ర్ రాజు త‌దిత‌రులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు