Thursday, September 19, 2024
spot_img

చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో రేపు మెగా జాబ్ మేళా : మంత్రి ఎర్రబెల్లి

తప్పక చదవండి

జనగామ : జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గ నిరుద్యోగ యువతకు రేపు(20-09-2023) నియోజకవర్గ కేంద్రం, బృందావన్ గార్డెన్స్‌లో ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా విజయవంతం చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గ యువతకు ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా జాబ్ మేళాలో సుమారు 80 కంపెనీలు పాల్గొంటాయాని 13 వేల ఉద్యోగాల భర్తీ కోసం ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. పదో తరగతి ఆపైన చదువుకున్న విద్యార్థులు, ఎలాంటి విద్యార్హతలు అవసరం లేకుండా కూడా కొన్ని జాబ్స్ కల్పిస్తున్నామని, సంబంధిత సర్టిఫికెట్లతో వచ్చి జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు