No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

మల్కాజిగిరిలో గెలిచేది మైనంపల్లె..

తప్పక చదవండి
  • ఎగిరేది కాంగ్రెస్ జెండే
  • లక్ష మెజార్టీతో మైనంపల్లిని గెలిపిస్తాం..
  • ఆరు పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం,
  • విజయం సాధిస్తాం

మల్కాజిగిరి : మల్కాజ్గిరి నియోజకవర్గం,గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని జ్యోతి నగర్ కమ్యూనిటీ హాల్ లో గౌతమ్ నగర్ డివిజన్ అధ్యక్షుడు వాయినాల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో, కాంగ్రెస్ పార్టీ బీర్ బ్లాక్ అధ్యక్షుడు వెంకటేష్ యాదవ్ నేతృత్వంలో,కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ, ఆదివారం నుండి పాదయాత్ర ద్వారా ప్రచారం మొదలు పెడుతున్నామని, ఇంటింటికి తిరుగుతూ ప్రజల్లోకి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పొందుపరిచిన 6 గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. గతంలో ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మల్కాజ్గిరి నియోజకవర్గం చేసిన అభివృద్ధి ప్రజలకు తెలియజేసి తిరిగి మల్కాజ్గిరిలో ఎమ్మెల్యేగా మైనంపల్లి హనుమంతరావుని లక్ష ఓట్ల మెజారిటీతో గెలిపించి కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని అన్నారు.కార్యక్రమంలో నాయకులు కోలుమల లక్ష్మణరావు, శంకర్,గ్యార ప్రవీణ్, మిరియాల రామచందర్,మనోజ్, స్వీటీ, కొమురయ్య, సుమలత యాదవ్, సుజాత, సిరిగిరి రాజు, తో పాటు సీనియర్ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు