No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

నగదు వరద..

తప్పక చదవండి
  • పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను సీజ్ చేసిన పోలీసులు..
  • హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున హవాలా నగదు
  • 48 గంటల్లోనే 50 కోట్ల సొత్తు స్వాధీనం
  • కోడ్ నేపథ్యంలో పోలీసుల విస్తృత తనిఖీలు

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలు ఉన్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా వాహన సోదాలు చేస్తున్నారు. అడుగడుగునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ నగరంలో హవాలా మార్గంలో డబ్బులు సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు అవసరమైన నగదును పార్టీలు తరలిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొననుంది. ఎలాగైనా అధికారంలోకి రావాలని మూడు పార్టీలు శాయాశక్తులా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో ఓటర్లు ఆకర్షించేందుకు పెద్ద ఎత్తున నగదు, మద్యం, బంగారం, వెండి పంచేందుకు సిద్ధమయ్యారు నేతలు. అందుకోసం ఇప్పటి నుంచే వాటన్నింటినీ అక్రమంగా తరలించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి కూడా. తెలంగాణలో నవంబర్ ౩౦వ తేది జరగనున్న తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 9న ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగా.. ఆ రోజు నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. అయితే.. కోడ్ అములులోకి వచ్చిన రోజు నుంచి.. హైదరాబాద్ సిటీ పోలీస్ నగర వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేస్తూ అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్‌తో పాటు ఓటర్లను ప్రలోభ పెట్టే ఇతర వస్తువులను స్వాధీనం చేసుకుంటున్నారు.

అక్టోబర్ 9 నుంచి 11 ఉదయం వరకు జరిపిన ఆకస్మిక తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, లిక్కర్ తదితర వస్తువులను పోలీసులు సీజ్ చేశారు. ఈ తనిఖీల్లో రూ. 42 కోట్లు విలువ చేసే 7.706 కిలోల బంగారం, 8.77 లక్షలు విలువ చేసే 11.700 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇక.. ఎలాంటి ఆధారాలు లేని 5.1 కోట్ల నగదును పట్టుకున్నారు. అంతేకాదు.. 110 లీటర్ల మద్యాన్ని, 23 మొబైల్ ఫోన్స్, 43 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇదంతా కేవలం హైదరాబాద్ నగరంలోనే కాగా.. ఇక రాష్ట్రమంతా కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడికక్కడ పోలీసులు చేస్తున్న తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారం స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానిక పోలీస్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, టాస్క్ ఫోర్స్‌తో పాటు ఇతర విభాగాలు 24 గంటలు పర్యవేక్షిస్తూ.. అన్ని వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తు్న్నారు. ప్రజలంతా కూడా తమ ప్రాంతాల్లో ఇలాంటి అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే సమాచారం అందజేయాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు