- 24 గంటల్లోపు కేసును ఛేదించిన వికారాబాద్ పోలీసులు
- బాలుడిని క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన సీఐ టంగుటూరి శ్రీను
వికారాబాద్ : 14 నెలల బాలుడిని కిడ్నాప్ చేసిన సంఘటన వికారా బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసు కుంది. ఈ కేసును పోలీసులు 24 గంటల్లోపు చేదించడం జరిగింది. పట్టణ సీఐ టంగుటూరి శ్రీను తెలిపిన వివరాల ప్రకారం… కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ గ్రామానికి చెందిన టేకు దుర్గమ్మ దుర్గేష్ దంపతులు వికారాబాద్ లోని గరీబ్ నగర్ లో కిరాయి ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. మంగళవారం రాత్రి 9:30 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి బాలుడి ఆచూకీ గురించి వెతకగా పిర్యాదు దారు నివాసం ఉంటున్న ఇంటి పక్కనే అద్దెకు ఉండే ముకురం గణేష్ అను వ్యక్తి బాబును కిడ్నాప్ చేసి ఎత్తుకుపోయినట్లు గుర్తించడం జరిగిందన్నారు. నిందితుడు గణేష్ బాబును(14నెలలు) ఎత్తుకుపోయి షాద్ నగర్ లోని చింత గుడలో తన సొంత అక్క దగ్గర ఉంచగా బుధవారం నిందితున్ని అదుపులోకి తీసుకొని బాబును పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి తల్లికి క్షేమంగా బాలుడిని సిఐ అప్పగించారు.నిందితుడిపై కేసు నమోదు చేసి చటారీత్యా చర్యలు తీసుకోబడతాయని తెలిపారు.కేసును ఛేదించి క్షేమంగా బాబును తీసుకువచ్చిన పోలీస్ సిబ్బందిని ఈ సందర్భంగా సిఐ అభినందించారు.