No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

కేసీఆర్ ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు..

తప్పక చదవండి
  • ఎన్నికల షెడ్యూల్‌కు ముందే ఎగిరెగిరి పడుతున్నాడు..
  • గజ్వెల్‌ నీ సొంద జాగీరు కాదు గుర్తుపెట్టుకో..
  • సీరియస్ వార్నింగ్ ఇచ్చిన తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్‌ రెడ్డి..

హైదరాబాద్‌ ఎన్నికల షెడ్యూల్‌ రాకముందే సీఎం కేసీఆర్‌కు అత్యుత్సాహం ఎక్కువైందని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఎద్దేవ చేశారు. శనివారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన విూడియాతో మాట్లాడుతూ..‘కుల సంఘాల పెద్దలు, వెనుకబడిన తరగతుల వారు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ హయాంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగలేదు. వారికి న్యాయం చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుంది. గజ్వేల్‌ చూడటానికి వెళ్తే భయం ఎందుకని ప్రశ్నించారు. గజ్వేల్‌ అభివృద్ధి జరిగితే, అక్కడికి డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లు వస్తే, దళితబంధు అందరికీ వస్తే కేసీఆర్‌కు భయం ఎందుకు పట్టుకుందన్నారు. గజ్వేల్‌ ఏమైన విూ ప్రవేట్‌ లిమిటెడ్‌ కంపెనీనా..? గజ్వేల్‌ నిజాం రాసిచ్చినడా..? లేక ఒవైసీ రాసిచ్చినడా..?. అని ప్రశ్నించారు. ఇలాంటి చేష్టలను చేస్తే చూస్తు ఊరుకునేది లేదన్నారు. బీజేపీ ఆషామాషీ పార్టీ కాదని కేసీఆర్‌ గుర్తు పెట్టుకోవాలి.కేసీఆర్‌ పథకాలు అన్ని రివర్స్‌ కొడుతున్నయి. దళితబంధు, బీసీబంధు, అన్ని ఫెయిల్‌ అయ్యాయి. కేసీఆర్‌ టికెట్లు ఇచ్చిన ఎమ్మెల్యేలు దళిత బంధులో 30శాతం కవిూషన్‌ తీసుకున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవన్ని ఘనంగా నిర్వహిస్తాం. తెలంగాణకు నిజాం నుంచి స్వేచ్ఛ వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. గ్రామగ్రామాన బీజేపీ తరపున నిర్వహిస్తామని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు