No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

బిఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు

తప్పక చదవండి
  • మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానం

మహబూబాబాద్‌ : పాలకుర్తి నియోజకవర్గం పెద్ద వంగర మండలం రాజ్‌మాన్‌ సింగ్‌ తండాకు చెందిన సర్పంచ్‌ గుగులోత్‌ పటేల్‌ నాయక్‌ నాయకత్వంలో కాంగ్రెస్‌ యువజన నాయకులు గుగులోత్‌ గణేశ్‌, గుగులోత్‌ యాకన్న, గుగులోత్‌ యాకన్నతోపాటు మరికొందరు ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమలో పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వారికి గులాబీ కండువాలు కప్పి, బీఆర్‌ఎస్‌ పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పార్టీ, నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులమై తాము బీఆర్‌ఎస్‌లో పార్టీలో చేరుతున్నట్లు వారు చెప్పారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో మంత్రి ఎర్రబెల్లి విజయం కోసం కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భూక్యా బాలకృష్ణ, గుగులోత్‌ సుధాకర్‌, గుగులోత్‌ నరేశ్‌, గుగులోత్‌ సుమన్‌, జాటోత్‌ సుమన్‌, గుగులోత్‌ రాజ్‌కుమార్‌, జాటోత్‌ సందీప్‌ తదితరులు ఉన్నారు. పాలకుర్తి నియోజకవర్గం, దేవరుప్పుల మండలం, సీతారాంపురం గ్రామానికి చెందిన బిజెపి యువజన నాయకులు, మిత్ర యూత్‌ సభ్యులు బి అర్‌ ఎస్‌ పార్టీ లో చేరారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు సమక్షంలో బుధవారం వారు గులాబీ కండువాలు కప్పుకున్నారు. వారిని బిఆర్‌ఎస్‌ పార్టీలోకి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆహ్వానించారు. బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరిన వారిలో జి. శ్రీనివాస్‌, డి. అఖిల్‌, జి. రాకెష్‌, సిహెచ్‌. అఖిల్‌, జి. శ్రీకాంత్‌, ఏ. శ్రీకాంత్‌, వి. విజయ్‌, ఏ. నవీన్‌, జి. ప్రదీప్‌, ఏ. ప్రదీప్‌, ఏ. సందీప్‌, జి. నవీన్‌ దితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు