No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

మిథున్ రెడ్డికి మద్దతుగా గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రచారం

తప్పక చదవండి

మహబూబ్ నగర్ : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి భాయ్ భాయ్ చెప్పే సమయం వచ్చిందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. సోమవారం మిథున్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇంటికి పంపించాల్సిన సమయం వచ్చిందని, బీజేపీకి ఓటు, వాళ్లకు రిటైర్మెంట్ ఇవ్వాలని పిలుపునిచ్చారు. రోడ్ షోలో పాల్గొన్న ఆయన అవినీతి చేసి సంపాదించిన ప్రతి ఎమ్మెల్యే, అదే విదంగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ఇండ్లలకు ఫామ్‌హౌస్‌లకు ప్రజల పక్షాన బుల్డోజర్లతో వెళ్లి, అవినీతి సొమ్మును తవ్వి తీస్తానని అన్నారు. కేటీఆర్ నేను ఒడిపోతానని చెబుతున్నారని, నన్ను ఓడ గొట్టేందుకు రూ.100 కోట్లు ఖర్చు పెట్టారని, ఎంత ఖర్చు పెట్టిన నా గెలుపు ఆపలేరన్నారు.

కాంగ్రెస్, బీఆర్ఎస్ దొంగలతో పాటు ఎంఐఎం దొంగలు ఒక్కటయ్యారు. బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ మద్యం తెలంగాణ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధి కోసం మంజూరు చేసిన నిధులలో అవినీతి చేసి సంపాదించిన డబ్బులతో ఇప్పుడు మీ దగ్గరికి అదే డబ్బుతో వస్తున్నారు. వారిని నమ్మకండి.. జాగ్రత్తగా ఉండండి.. వారి మాయమాటలు నమ్మి మరోసారి మోసపోకండి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు