- వీళ్ల పనితనం చూస్తే నవ్వు ఆగదు…?
- సీసీ రోడ్డు వేశారు..స్తంభాన్ని మరిచారు..!
- రోడ్డు మధ్యలోనే విద్యుత్ స్తంభం..!
- ప్రమాదాలకు గురవుతున్న వాహనచోదకులు..!
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు..!
- పట్టించుకోని అధికార యంత్రాంగం..!
చెన్నారావుపేట : మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో మూడో అవార్డుకు సంబంధించినటువంటి గుల్లపెళ్లి స్వామి ఇంటి సమీపంలో ఉన్నటువంటి విద్యుత్తు లైను వాహనదారుల రాకపోకలకు అడ్డంగా మారిన విద్యుత్ లైన్, రైతులు ఎడ్లబండ్లను తీసుకెళ్లేందుకు మరియు ట్రాక్టర్లను తీసుకువెళ్లేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు ద్విచక్ర వాహనదారులు అనేకమార్లు ఈ స్తంభానికి గుద్దుకొని గాయాలపాలు అవ్వడం జరిగింది,కావున ఇట్టి సమస్యను త్వరగా పరిష్కరించి ఈ విద్యుత్ స్తంభాన్ని రోడ్డు మధ్యలో నుండి తొలగించి రోడ్డుకు ప్రక్కగా నాటవలసిందిగా స్థానిక ప్రజలు విద్యుత్ అధికారులను కోరుతున్నారు..