Saturday, September 21, 2024
spot_img

బిఆర్ఎస్ పార్టీ నాయకులుచేసిన వికృత చేష్టలను మరవకండి

తప్పక చదవండి
  • కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా నుంచి షేక్ ముస్తాఫా..

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా షేక్ ముస్తఫా మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులు ఎలక్షన్ రావడంతో ప్రతి ఇల్లు తిరగడం మొదలుపెట్టారు.. కానీ గృహలక్ష్మి, దళిత బందు అనే పథకాలు ఎవరికి ఇవ్వాలో అనే నిర్ణయం తీసుకునేటప్పుడు ఇలా మీ అందరిని పిలిచారా ఒక్కసారి ఆలోచించండి.. ఆ రోజు కులమత బేధాలు లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన పార్టీ మన కాంగ్రెస్ పార్టీ.. సంక్షేమ పథకాలు ప్రతి పేదవారి ఇల్లు చేరాలంటే అది కాంగ్రెస్ పార్టీకే సాధ్యం.. ఆలోచన చేయండి.. ఓట్లు అనగానే ఈ రోజు మీ దగ్గరికి వచ్చారు. అదే ఓట్లు లేకపోతే మిమ్మల్ని పట్టించుకునే వారు ఎవరూ లేరు.. మీరు వేసే ఓటు ద్వారా మిమ్మల్ని ఓటు అడుగుతున్న నాయకులు మాత్రమే లబ్ది పొందుతున్నారు.. ఒక్కసారి ఆలోచన చేయండి.. హుజుర్నగర్ నియోజకవర్గ ఓటర్లారా ఈ రాష్ట్రంలో రైతుల రుణమాఫీ, ఫీజు రీబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, వడ్డీ లేని డాక్రా రుణాలు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ ఆరోజే కాంగ్రెస్ పార్టీ చేసినవే..9 సంవత్సరాల టిఆర్ఎస్ పార్టీ పాలనలో ఎవరు అభివృద్ధి చెందారో ఒక్కసారి మీరందరూ ఆలోచన చేయండి.. హుజుర్నగర్ నియోజకవర్గం అభివృద్ధి చూసుకుందాం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే ఉన్నది.. ఓట్లు మాత్రం మనమేస్తున్నాం.. అభివృద్ధి వచ్చేసరికి మా తమ్ముడు, మా అన్న, మా అమ్మ, మా అక్క అనే దగ్గరే నాయకులు కొట్టుకుంటున్నారు. అలాంటప్పుడు ఏ నాయకులు కూడా మీకు న్యాయం చేయరు.. న్యాయం అంటే మనం లబ్ధి పొందడం కాదు.. నిజంగా ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలి.. చదువుకున్న ప్రతి పేద విద్యార్థికి ఫీజు రీమెర్స్మెంట్ అందాలి.. అది కాంగ్రెస్ పార్టీ లక్ష్యం.. హుజుర్నగర్ నియోజకవర్గంలో గృహలక్ష్మి అనే పథకం ఒక్కొక్క కులాలను తీసుకొని మాట్లాడుకుందాం. ఎంతమందిని పిలిచి ఎవరు ఎవరికి గృహలక్ష్మి అనే పథకం ఇవ్వాలని మాట్లాడారా.. ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్క కుల సంఘం, కుల సంఘాల నాయకులు గుర్తుకొస్తున్నారు అని ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అవినీతి ప్రభుత్వ పాలనా విధానాలను ఎండగట్టారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు