Thursday, October 24, 2024
spot_img

కాంగ్రెస్‌ మాటలు నమ్మి మోసపోవద్దు

తప్పక చదవండి
  • నమ్మి పొరపాటున ఓటేస్తే 5 గంటలే కరెంటు ఇస్తరు
  • బిఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ను మరొకసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించండి
  • ప్రజలను కోరిన చేవెళ్ల ఎంపీ డాక్టర్‌. గడ్డం రంజిత్‌ రెడ్డి

వికారాబాద్‌ : కాంగ్రెస్‌ మాటలను,వారి హామీలను నమ్మి ప్రజలు మోసపోవద్దు. వచ్చేది కేసీఆర్‌ ప్రభుత్వమే, బలమైన గులాబీ దళమే కేసిఆర్‌ బలమని చేవెళ్ల ఎంపీ డాక్టర్‌ గడ్డం రంజిత్‌ రెడ్డి అన్నారు.బుధవారం వికారాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని తుర్మామిడి,మద్వాపుర్‌ తదితర గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొ న్నారు.24 గంటలు కరెంటు ఇచ్చే రాష్ట్రంలో 5 గంటల కరెంటు గురించి మాట్లాడుతూ… కుప్పిగం తులు వేసే కాంగ్రెస్‌ ను కతం చేద్దాం అన్నారు. కర్ఫ్యూల కాంగ్రెస్‌ పాలన వద్దనీ, శాంతియుతమైన కెసిఆర్‌ సార్‌ సంక్షేమ పాలనే ముద్దన్నారు. కాంగ్రెస్‌ పార్టీ చెప్పే వారంటీ లేని గ్యారెంటీ కార్డును నమ్మవద్దన్నారు. ఆచరణకు సాధ్యం కానీ హామీల పేరుతో అధికారంలోకి రావాలని చూస్తున్న కాంగ్రెస్‌ ను తిరస్కరించాలని కోరారు. పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి దేశానికే ఆదర్శం అని గుర్తు చేశారు. కెసిఆర్‌ సర్కార్‌ తోనే మరింత అభివృద్ధి సాధ్యమన్నారు. ఎల్లప్పుడూ వికారాబాద్‌ నియోజక వర్గంలో అందుబాటులో ఉండే డాక్టర్‌ మెతుకు ఆనందును మరోసారి ఎమ్మెల్యేగా ఆశీర్వదించాలని కోరారు.ఈ సందర్భంగా కమ్మర్పల్లి దర్గా వద్ద, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో, చర్చిలో, మైబుసుభాని దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు