No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

మంచిర్యాలజిల్లా ప్రధాన న్యాయమూర్తిగా కాళ్ళూరి ప్రభాకర్ రావు ఎన్నిక..

తప్పక చదవండి

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘ అధ్యక్షులుగా మంచిర్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి కాళ్ళూరి ప్రభాకర్ రావు ఎన్నిక అయ్యారు. సంఘ ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి యస్. శ్రీవాణి ఎన్నికయ్యారు. గత మూడు సంవత్సరాలుగా న్యాయమూర్తుల సంఘ ఉపాధ్యక్షులుగా భాద్యతలు నిర్వహిస్తున్న కాళ్ళూరి ప్రభాకర్ రావు సంఘ అధ్యక్షులుగా ఎన్నికయ్యారు . సంఘ అధ్యక్షులుగా శుక్రవారం ప్రభాకర్ రావు భాద్యతలు చేపట్టారు. అధ్యక్షులుగా భాద్యతలు చేపట్టిన కాళ్లురి ప్రభాకర్ రావు, నూతన ఉపాధ్యక్షులు శ్రీవాణి లను గత అధ్యక్షులు నందికొండ నర్సింగ్ రావు, ప్రస్తుత న్యాయమూర్తుల సంఘ ప్రధాన కార్యదర్శి కే. మురళి మోహన్, ఉపాధ్యక్షులు జి సుదర్శన్, సహాయ కార్యదర్శులు కే. దశరధరామయ్య, జాబిశెట్టి ఉపేందర్ రావు, ఎగ్జిక్యూటివ్ సభ్యులు సీనియర్ సివిల్ జడ్జి మండ వెంకటేశ్వరరావు, అబ్దుల్ జలీల్, ముదిగొండ రాజు, బి. సౌజన్య తదితరులు అభినందనలు తెియజేశారు.
న్యాయమూర్తుల సంక్షేమం కోసం అసోసియేషన్ కృషి. – నూతన అధ్యక్షులు కె. ప్రభాకర్ రావు.
తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న న్యాయమూర్తుల సంక్షేమం కోసం, తెలంగాణ రాష్ట్ర న్యాయమూర్తుల సంఘం కృషి చేస్తుందని అసోసియేషన్ కు నూతనంగా ఎన్నిక కాబడిన అధ్యక్షులు కె. ప్రభాకర్ రావు అన్నారు. ఈ బాధ్యత అప్పగించిన సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు