- ప్రత్యేక హెల్ప్ డెస్క్ నెంబర్ 63040 62768 ఏర్పాటు..
- వివరాలు వెల్లడించిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య..
జనగామ: ఈ నెల 15వ తేదీన (శుక్రవారం) నాడు జరిగే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని సోమవారం నాడు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.. జిల్లా వ్యాప్తంగా (10) సెంటర్లు, ఏర్పాట్లు చేసినట్లు (110) మంది ఇనివిజిలేటర్స్, హల్ సూపరింటెండెంట్ లు (30), చీఫ్ సూపర్డెంట్ గా (11) మంది జిల్లా అధికారులు,(11) మంది డిపార్ట్మెంట్ అధికారులు, రూట్ ఆఫీసర్ గా ఇద్దరు, ఫ్లయింగ్ స్క్వాడ్ (1) ఒక్కరిని నియమించినట్లు, 15వ తేదీ ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, జరిగే పరీక్షలకు (2258) మంది హాజరవుతారని, మధ్యాహ్నం 2.30. నుండి 5. వరకు , జరిగే ఈ పరీక్షలకు (2085) మంది, మొత్తం జిల్లా వ్యాప్తంగా (4343) మంది హాజరు అవుతున్నట్లు ఆయన తెలిపారు..
తప్పక చదవండి
-Advertisement-