ఎలక్షన్ రానే వచ్చింది..
రాజకీయ నాయకులకి గడ్డుకాలం ముందుంది..
గ్రామంలో క్రికెట్ ఆడేటప్పుడు
చుట్టూ మనవాళ్లే అనుకుంటాం
కానీ అవుట్ చేయడానికి కాచుకొని ఉంటారు..
ప్రస్తుత రాజకీయాలు అలాగే కనబడుతున్నాయి..
అంత మనవాళ్లే అనుకుంటే
పప్పులో కాలేసినట్టే..
నిన్ను ముంచేందుకే నీ చుట్టూ
చేరారని గ్రహించలేకపోతున్నావు..
ఓ నాయకుడా జరభద్రం..
పదవి ఉంది అని ఇన్ని రోజులు
ప్రజలని పక్కన పెట్టినవ్ లే..
సమయం వచ్చింది..
నీ పక్కన ప్రజలు చేరారు
దెబ్బకు దెబ్బ కొట్టేందుకు
ప్రజలు సిద్ధంగానే ఉండ్రు జర్ర పైలం
` మర్రి నాగిరెడ్డి
- Advertisement -