No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

యూకేలో హైదరాబాద్‌ వ్యక్తి దారుణ హత్య

తప్పక చదవండి

లండన్‌ : తనకు సంబంధం లేని గొడవలో తలదూర్చి ఓ హైదరాబాదీ వ్యక్తి యూకేలో ప్రాణాలు పోగొట్టుకున్నాడు. వారం రోజుల్లో కూతురి పెండ్లికి ఏర్పాట్లు చేసుకున్న 65 ఏండ్ల వృద్ధుడిని కొంతమంది దారుణంగా హత్య చేశారు. లీడ్స్‌ వెస్ట్‌ యార్క్‌ర్‌లో హిల్‌ టాప్‌ ఎవెన్యూ వద్ద మహమ్మద్‌ ఖాజా రయూసుద్దీన్‌ను ఇద్దరు దుండగులు హత్య చేశారు. ఉగాండా వాసులుగా అనుమానిస్తున్న ఆ ఇద్దరు వ్యక్తులు నేపాల్‌ వ్యక్తితో ఘర్షణకు దిగారు. గొడవను ఆపేందుకు ప్రయత్నించిన రయీసుద్దీన్‌ కత్తిపోట్లకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయనను దవాఖానకు తరలించగా అప్పటికే మృతిచెందారు. నిందితులిద్దరినీ అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు. 2011 నుంచి లండన్‌లో నివసిస్తున్న రయీసుద్దీన్‌కు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. అక్టోబర్‌ 5న హైదరాబాద్‌లో జరిగే కుమార్తె వివాహానికి వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుం టుండగా ఈ ఘోరం జరిగింది. రయీసుద్దీన్‌ కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో నివాసముంటున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు