- కొత్తూరు సీఐ శంకర్రెడ్డి
కొత్తూరు : ఎన్నికల కోడ్ అమల్లోనికి రావడంతో పోలీసులు ఈనెల 9 మధ్యాహ్నం నుంచే పూర్తిస్థాయిలో రహదారులపై చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా కొత్తూరు మండలం జేపీ దర్గా రోడ్డు వద్ద సీఐ శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం వాహన తనిఖీలు చేస్తుండగా శ్రీనివాస శాస్త్రి వద్ద రూ,7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.ఆ నగదుకు సంబంధించి పూర్తి ఆధారాలతో ద్రువపత్రాలు సమర్పిస్తే నగదును సదరు వ్యక్తులకు అందిస్తామని అట్టి డబ్బులను డిస్టిక్ట్ గ్రీవిన్స్ కమిటీకి అందజేసినట్లు సిఐ శంకర్ రెడ్డి తెలిపారు.ఈ తనిఖీల్లో ఎసై శ్రీనివాస్,కానిస్టేబుళ్లు మహేష్, గోపాల్,తదితరులు పాల్గొన్నారు.