Friday, April 19, 2024

క్రికెట్ కింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు..

తప్పక చదవండి
  • మాఫియాతో ప్రభుత్వం చేతులు కలిపింది..
  • వ్యవస్థను మార్చుకోవడం ఆప్ కి వెన్నతోపెట్టిన విద్య..
  • ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదు..

అమృత్ సర్ : పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సంచలన ఆరోపణలు చేశారు. పంజాబ్ రాష్ట్రానికి చెందిన అనేక సమస్యలపై ఆప్ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రజల దృష్టిని వాస్తవ సమస్యల నుంచి మళ్లించేందుకే ప్రభుత్వం సట్లెజ్ యమునా లింక్ కాలువ సమస్యకు ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. జలంధర్‌లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తమ స్వలాభం కోసం వ్యవస్థను మార్చుకోవడం దారుణమన్నారు. ఆ వ్యవస్థ రాష్ట్రాన్ని వెనుకకు నెట్టివేసిందన్న ఆయన, అందుకే నేటికీ వాస్తవ సమస్యల నుండి దృష్టి మరల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. పంజాబ్‌లో 80 శాతం నీరు డార్క్ జోన్‌లో ఉందని, రాష్ట్రంలో తక్కువ నీరు ఉందని, అయితే తమ వద్ద ఉన్న నీటిని ఆదా చేసేందుకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని సిద్ధూ మండిపడ్డారు. తాగునీరు దొరకని విధంగా నీటి సమస్య పెరిగిందన్న ఆయన.. పంజాబ్‌లో నీటి కొరత తీర్చడంలో ఆప్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. గత పదేళ్లలో వర్షపాతం 30 శాతం తగ్గిందన్న సిద్ధూ.. ముఖ్యమంత్రికి జనం బాధలు పట్టడం లేదని విరుచుకుపడ్డారు.

పంజాబ్ రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తాగునీరు కూడా లేదని, ఉన్న నీటిని ఎలా నిర్వహించాలనేదే అసలు సమస్య అని కాంగ్రెస్ నేత సిద్ధూ అన్నారు. ప్రజలకు తాగేందుకు అందుబాటులో ఉండాల్సిన కాలువ నీటిని కలుషితం చేశారని ఆరోపించారు. పంజాబ్‌లోని బియాస్, సట్లెజ్ నది సంగమం హరికే బ్యారేజీ వద్ద ఏ గ్రేడ్ కాలువ నీరు త్రాగడానికి సరిపోతుంది. ఇప్పుడు అది C గ్రేడ్‌కు మారింది. ఇప్పుడు రోపర్ కాలువ నీరు మాత్రమే తాగడానికి ఉపయోగపడుతుందన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు