- నివాళులార్పించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్
హైదరాబాద్ : బీపీ మండల్ జయంతి వేడుకలు రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. బీపీ మండల్ చిత్రపటానికి రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్.. బీపీ మండల్ చిత్రపటానికి పూల మాలవేసి నివాళులార్పించారు. ఈ సందర్భంగా శుభప్రద్ పటేల్, కిశోర్ గౌడ్ మాట్లాడుతూ.. బీపీ మండల్ స్ఫూర్తితో ముఖ్యమంత్రి కేసీఆర్ బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్నారని వివరించారు. బీపీ మండల్ వెనుకబడిన వర్గాల పక్షపాతి అన్నారు. వెనుకబడిన వర్గాల వారి కోసం ఆయన చేసిన సేవలు మరవలేనిదన్నారు.