మరోసారి కాల్పుల కలకలం..

( అమెరికా లాస్ ఏంజిల్స్ లో పార్క్ లో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. )
- నాలుగు పురుషులు, ముగ్గురు మహిళలకు గాయాలు..
- ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరి మృతి..
- అప్రమత్తమైన పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం..
న్యూయార్క్, 25 జూలై ( ఆదాబ్ హైదరాబాద్ ) :
అమెరికాలో లాస్ ఏంజెల్స్లోని ఓ పార్క్లో కాల్పులు జరిగినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది. ఈ మేరకు శాన్ పెడ్రోలోని పెక్ పార్క్ వద్ద కాల్పులు జరిగినట్లు తెలిపింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా...ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. ఈ మేరకు పెక్పార్క్ వద్ద ఇరువర్గాల మధ్య తలెత్తిని వివాదం కాల్పులకు దారితీసినట్లు పోలీసులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ ఘటనకు పాల్పడిన వారిలో ఎక్కువమంది షూటర్లు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అంతేగాదు ఈ ఘటనలో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలతో సహా దాదాపు ఏడుగురు గాయపడినట్లు తెలిపారు. పోలీసులు వెంటనే అప్రమత్తమై సంఘటన స్థలానికి చేరుకుని వేగవంతంగా దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఈ కాల్పుల్లో గాయపడిని ఏడుగురిని ఆస్పత్రికి తరలించామని, ఇద్దరు మాత్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్లు వెల్లడించారు.