హైదరాబాద్ : సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ చీఫ్ చంద్రబాబు పరామర్శించారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్, వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు. ఇటీవలే కేసీఆర్కు తుండి మార్పిడి శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. వాకర్ సాయంతో కేసీఆర్ నడుస్తున్నారు. కేసీఆర్ కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఒకట్రెండు రోజుల్లో కేసీఆర్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇక తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో పాటు పలువురు నాయకులు కేసీఆర్ను పరామర్శించారు. ఇవాళ మధ్యాహ్నం సినీ నటుడు ప్రకాశ్ రాజ్, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, మల్లారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు మధుసూదన చారి, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, బీఆర్ఎస్ నాయకుడు చల్మడ లక్ష్మి నరసింహారావు తదితరులు కేసీఆర్ను పరామర్శించారు.