Wednesday, April 17, 2024

మణిపూర్ అఘాయిత్యాన్ని తీవ్రంగా పరిగణించిన సుప్రీం కోర్టు..

తప్పక చదవండి
  • ఇది చాలా బాధాకరం అంటూ వ్యాఖ్య..
    మణిపూర్‌లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ.. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు ఏం చేయలేకపోయారని కేంద్ర, మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్‌ జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని బెంచ్‌ గురువారం మండిపడింది.

మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన దృశ్యాలు, కథనాల ఆధారంగా మణిపూర్‌ ఘటనను సుమోటాగా స్వీకరించింది సుప్రీం కోర్టు. సదరు వీడియో దిగ్భ్రాంతికి గురి చేసేదిలా ఉందన్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మహిళలను హింసకు సాధనాలుగా ఉపయోగించడం అంగీకరించలేని విషయం. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది.

మే 3వ తేదీన ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అలాంటప్పుడు ఇంతకాలం ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. మీకు కొంత సమయం ఇస్తున్నాం. ఈలోపు చర్యలు తీసుకోండి. లేదంటే మేం రంగంలోకి దిగుతాం. ప్రజాస్వామ్యానికి ఇది ఆమోదకరమైన విషయం కాదు అని పేర్కొంటూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.

- Advertisement -

సీఎం బీరెన్‌ వీడియో సందేశం

మణిపూర్‌ కీచక

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు