గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో దురుసుగా ప్రవర్తించారన్న కారణంతో కాంగ్రెస్ సభ్యులపై వేటు వేయడాన్ని బీజేపీ తప్పుపట్టింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు కోరుతూ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రవేశపెట్టిన తీర్మానంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు, బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్రెడ్డిల మధ్య వాడీవేడి సంవాదం నడిచింది. అరాచక శక్తులను సహించేది లేదని, కాంగ్రెస్ సభ్యుల్లో అసహనం పెరిగిపోయిందని సీఎం ఆగ్రహించగా.. నిన్నటి ఘటన ఉద్దేశపూర్వకంగా జరిగిందికాదని...