చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకై కలిసి రావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులకు పిలుపు..

చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకై కలిసి రావాల్సిందిగా  అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులకు పిలుపు..


- దాసు సురేశ్ , వ్యవస్థాపక అధ్యక్షులు - బీసీ రాజ్యాధికార సమితి 
హైదరాబాద్, 31 జనవరి ( ఆదాబ్ హైదరాబాద్ ) :
చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ల సాధనకై (మొదటి దశలో 27 శాతం) కేంద్ర ప్రభుత్వం చేపట్టాల్సిన రాజ్యాంగ సవరణ కోసం ఫిబ్రవరి 3 వ తేదీ నుండి ఢిల్లీ వేదికగా నిర్వహించే  " బీసీల ఛలో ఢిల్లీ " కార్యక్రమానికై కలిసి రావాల్సిందిగా అన్ని రాజకీయ పార్టీల బీసీ నాయకులకు  బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేశ్ పిలుపునిచ్చారు.. రాజకీయ పార్టీల ఎదుగుదలకు పునరoకితమై,అవకాశాలను అందుకునే సమయానికి అగ్రవర్ణ పార్టీల అణిచివేతకు గురవుతూ, మానసిక క్షోభకు లోనవుతూ,ఆర్థిక భారాన్ని మోస్తూ అవమానాలను భరిస్తూ పార్టీలకు సేవ  చేస్తున్న బీసీ నాయకులందరికీ బీసీ రాజ్యాధికార సమితి అండగా,బలమైన వేదికగా నిల్వనుందని తెలిపారు..వివిధ పార్టీలలో వివక్షను ఎదుర్కొంటున్న బీసీ నాయకులు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ లను సాధించుకోగలిగినప్పుడే తమ అవకాశాలు మెరుగుపడతాయని తద్వారా తమ ప్రజలకు చేరువై సేవ చేసే అవకాశం లభిస్తుందన్నారు.బీసీ నాయకులు అసెంబ్లీ పార్లమెంటులలో ప్రవేశించడం ద్వారా జిల్లా పరిషత్ చైర్మన్ లుగా , మేయర్ లుగా జడ్పిటీసి లుగా , మున్సిపల్ చైర్మన్ లుగా , ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డ్ మెంబర్లుగా, నామినేటెడ్ పదవుల్లో వేలాది మంది బీసీ నాయకులకు అవకాశాలు కల్పించి తద్వారా రాజ్యాధికారానికి బీసీ లను చేరువ చేసే అవకాశం లభిస్తుందని పేర్కొన్నారు..

వివిధ పార్టీలలో అనేక సంవత్సరాలుగా  తమ విలువైన సమయాన్ని,శక్తిని వినియోగిస్తున్న బీసీలు నాయకులు తమకు కొనసాగుతున్న వివక్షను ధైర్యంగా ఎదిరించగలిగినప్పుడే తమ అవకాశాలు మెరుగుపడతానే విషయాన్ని గ్రహించాలన్నారు.ప్రతిఘటన ద్వారానే  చట్టసభల్లో బీసీ రిజర్వుడు పార్లమెంటరీ అసెంబ్లీ స్థానాలను మనం సాధించుకోవడమే కాక తమ తమ పార్టీలలోసముచిత ప్రాధాన్యత, గౌరవం, అవకాశాలను సైతం శీఘ్రఘతన బీసీ లు పొందగలుగుతారన్నారు.. దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలను సమన్వయం చేసుకుంటూ చట్టసభల్లో బీసీ రిజర్వేషన్లసాధన  కోసం నిర్వహించబోయే మహాకార్యానికి బీసీ నాయకులు, జర్నలిస్టులు,న్యాయవాదులు, కవులు కళాకారులు, సామాజిక ప్రజాసంఘాల ఉద్యమం నాయకులు, కుల సంఘాలు,కార్మిక కర్షక రైతు సంఘాల నాయకులు, మేధావులు, మహిళలు, యువత, విద్యార్థులు పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిచ్చారు..

Tags :