- మెట్రిక్ టన్నుకు రూ. 1400 అదనం..
- డీలర్లతో సమావేశంలో మంత్రుల నిర్ణయం..
- ఏటా అదనంగా రూ.139 కోట్లు కేటాయింపు..
- రాష్ట్రంలోని 17, 227 డీలర్లకు లబ్ది..
- హర్షం వ్యక్తం చేస్తున్న రేషన్ డీలర్లు..
రేషన్ డీలర్లకు తెలంగాణ ప్రభుత్వం తీపికబురును అందించింది. రాష్ట్రంలోని 1, 227 మంది రేషన్ డీలర్ల కవిూషన్ను మెట్రిక్ టన్నుకు రూ.1400కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గతకొద్దిరోజులుగా తమ సమస్యలపై రేషన్ డీలర్లు పోరాడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రేషన్ డీలర్ల సంఘాలతో మంగళవారం సచివాలయంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ నిర్వహించిన చర్చలు సఫలమయ్యాయి. రేషన్ డీలర్ల కవిూషన్ను ఏకంగా ఏడు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఏర్పాటు నుంచి రూ.200లుగా ఉన్న కవిూషన్ రూ.1400కు పెంచుతూ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్ర ప్రభుత్వం ఏటా అదనంగా రూ.139 కోట్లు కేటాయించనుంది. అలాగే కరోనాలో చనిపోయిన 100 మంది డీలర్ల వారసులకు షాపులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బీమా, వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ రెన్యూవల్ ఐదేళ్లకు పెంపు, రేషన్ భవన్, అంత్యక్రియల సాయం తదితర 13 ప్రధాన అంశాలకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది. పేదల సంక్షేమం, రేషన్ డీలర్ల సంక్షేమంలో తెలంగాణ తిరుగులేదని మరోసారి నిరూపించింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సొంతంగా 91 లక్షల పేదలకు ఆహార ధాన్యాల సరఫరా చేస్తోంది. కేంద్రం కేటాయింపులు పెంచకున్నప్పటికీ వాటిని తెలంగాణ సర్కార్ అందిస్తోంది. కవిూషన్ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తూ.. ధన్యవాదాలు తెలియజేసింది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ కేంద్ర ప్రభుత్వ కోటాకు అదనంగా ఇవ్వడం లేదని కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్రంలోని 90.05 లక్షల కార్డుల్లో దాదాపు 35.56 లక్షల కార్డుల్లోని 91 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఒక్కొక్కరికి ఆరుకిలోల చొప్పున అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వ కార్డులకు సైతం అదనంగా కిలోను కేటాయిస్తున్నామన్నారు. కవిూషన్ సైతం కేంద్రం పెంచకున్నా పెంచి అందిస్తున్నామన్నారు. క మొత్తంగా రూ. 1400 కవిూషన్ పెంచడమే కాకుండా రేషన్ డీలర్లు అడుగుతున్న ప్రధానమైన 13 అంశాలను ప్రభుత్వం పరిష్కరించిందని మంత్రులు తెలిపారు. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్షిప్ మంజూరు చేయడం, రాష్ట్రంలో అమలవుతున్న రైతు, నేత, గౌడ తదితర బీమాల తరహాలో రేషన్ డీలర్లకు రూ. 5 లక్షల బీమా అమలు చేయడం, ఆరోగ్యశ్రీ పరిధిలోకి ప్రతీ డీలర్ను తీసుకురావడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద కచ్చితమైన తూకం వేసేలా వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్షిప్ రెన్యూవల్ని ఐదేండ్ల కాలపరిమితికి పెంచడం, రేషన్ డీలర్షిప్ వయోపరిమితిని 40 నుండి 50 ఏండ్లకు పెంచడం, అంత్యక్రియల నిర్వహణకు తక్షణ సాయం రూ. 10 వేలు, 1.5 క్వింటాళ్ల వేరియేషన్ను కేసుల పరిధి నుండి తీసివేయడం, హైదరాబాద్లో రేషన్ భవన్ నిర్మాణానికి భూకేటాయింపు తదితర 13 అంశాలపై సానుకూలత వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. డీలర్ల కవిూషన్ పెంపు సహా తమ ఇతర సమస్యల పరిష్కారించిన ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్కు రేషన్ డీలర్లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తమ కడుపునిండా అన్నం పెట్టేలా కృషి చేసిన మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్కు, డిప్యూటీ స్పీకర్ పద్మారావ్ గౌడ్, ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిలకు సమావేశంలోనే ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులతో పాటు సివిల్ సప్లైస్ కమిషనర్ వి అనిల్ కుమార్, రేషన్ డీలర్ల జేఏసీ ప్రతినిధులు నాయికోటి రాజు, మల్లిఖార్జున్, రవీందర్, నాయక్ తదితరులు పాల్గొన్నారు.