ప్రతిష్టాత్మకమైన అంబేద్కర్ విద్యార్థి సంఘానికి నూతన ఓయూ అధ్యక్షుడిగా శశివర్ధన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని కమిటీ తెలిపింది.. తాజా మాజీ అధ్యక్షుడు దివాకర్ పూలే తన పదవి కాలం ముగియడంతో. ఎన్నిక ప్రక్రియను మొదలు పెట్టింది కమిటీ.. ఈ నేపథ్యంలో శశిధర్ ని ఏకగ్రీవంగా ఎన్నుకుంది. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి దివాకర్ తన అభినందనలు తెలిపారు.. సంఘాన్ని పటిష్టంగా ముందుకు నడపాలని విద్యార్థుల సమస్యల పట్ల నిరంతరం పోరాడాలని విద్యార్థుల్లో చైతన్యాన్ని నింపుతూ సంఘ కార్యక్రమాలు కొనసాగాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. మహనీయుల ఆశయాలకు అనుగుణంగా సంఘ కార్యక్రమాలు కొనసాగాలని ఆయన కోరారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడికి కమిటీ సభ్యులందరూ శుభాకాంక్షలు తెలిపారు.