షేన్ వార్న్ జ్ఞాపకార్థం పాకిస్థాన్, ఆస్ట్రేలియా మధ్య బాక్సింగ్ డే టెస్టు జరగనుంది. క్రికెట్ ఆస్ట్రేలియా , షేన్ వార్న్ లెగసీ కూడా లెజెండరీ స్పిన్నర్ జ్ఞాపకార్థం టెస్ట్ మ్యాచ్లో మొదటి 4 రోజులలో అభిమానుల కోసం ఉచిత గుండె పరీక్షలను నిర్వహించబోతున్నాయి. మంగళవారం, డిసెంబర్ 12న క్రికెట్ ఆస్ట్రేలియా తన వెబ్సైట్లో ఈ సమాచారాన్ని అందించింది. ఈ ఏడాది బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 26 నుంచి 30 వరకు మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనుంది. ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ వార్న్ 2022 మార్చిలో గుండెపోటుతో మరణించాడు. అప్పటికి వార్న్ వయసు 52 ఏళ్లు మాత్రమే. ఉచిత గుండె పరీక్ష కోసం మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ , చుట్టుపక్కల 23 మెడికల్-గ్రేడ్ హెల్త్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఇక్కడ ప్రజలు నాలుగు నిమి షాల పరీక్ష చేయించుకునే అవకాశం ఉంది. క్రికెట్ ఆస్ట్రేలియా, షేన్ వార్న్ లెగసీ ద్వారా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది. మెల్ బోర్న్ మ్యాచ్లో ఫ్లాపీ టోపీ ధరించి వార్న్కు నివాళులర్పించాలని బోర్డు అభిమానులను అభ్యర్థించింది. గతేడాది కూడా ఆస్ట్రేలి యా, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు జాతీయ గీతాలాపన సమయంలో ఫ్లాపీ టోపీలు ధరించి వార్న్కు నివాళులర్పించారు. షేన్ వార్న్ టెస్ట్ క్రికెట్లో 600 మరియు 700 వికెట్ల మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోనే మొదటి బౌలర్గా నిలిచాడు. 2005లో ఇంగ్లండ్తో జరిగిన ఓల్డ్ ట్రాఫోర్డ్ టెస్టులో 600 వికెట్లు పూర్తి చేశాడు. 2006లో మెల్బోర్న్లో ఇంగ్లండ్పై వార్న్ 700 వికెట్ల మైలురాయిని కూడా అధిగమించాడు. ఆ తర్వాత శ్రీలంక దిగ్గజ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ తన రికార్డును బద్దలు కొట్టాడు. మురళీ 800 వికెట్లు తీశాడు. ఇప్పటికీ అత్యధిక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ వార్నే. భారత ఆటగాడు అనిల్ కుంబ్లే 619 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. షేన్ వార్న్ ూణI క్రికెట్లో కూడా చాలా ప్రభావవంతమైన బౌలర్. 1999 ప్రపంచకప్లో ఆస్ట్రేలియాను ఛాంపియన్గా మార్చడంలో వార్న్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నమెంట్లో ఆస్ట్రేలియా రెండు ముఖ్యమైన మ్యాచ్లు, సెమీ-ఫైనల్ (దక్షిణాఫ్రికాపై), ఫైనల్ (పాకిస్తాన్పై)లో అతను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపిక య్యాడు. షేన్ వార్న్ 23 ఏళ్ల వయసు లో 1992లో భారత్తో జరిగిన సిడ్నీ టెస్టులో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అతను జనవరి 2007లో సిడ్నీలో ఇంగ్లాండ్తో తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. బాక్సింగ్ డే క్రికెట్లోకి ప్రవేశించడం 1892లో జరిగింది. 1892లో, క్రిస్మస్ సందర్భంగా మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో విక్టోరియా వర్సెస్ న్యూ సౌత్ వేల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఆ తర్వాత, ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా రెండు జట్ల మధ్య మ్యాచ్లు జరగడం ఆనవాయితీగా మారింది. ప్రతి సిరీస్లో బాక్సింగ్ డే ఖచ్చితంగా చేర్చబడిరది.