- ఉద్యోగాల పేరుతో మోసం..
హైదరాబాద్ (ఆదాబ్ హైదరాబాద్): మాజీ సీఎం కార్యాలయంలో ఓ ప్రైవేట్ వ్యక్తి అరెస్టు కావడం కలకలం రేపుతోంది. తెలంగాణ సీఎం ఎన్నికల పబ్లిసిటీ సెల్ లో ఓ దొంగ.. ప్రోటోకాల్ ఆఫీసర్ గా అవతారం ఎత్తి దొరికినంత దోచేసి అరెస్ట్ అయ్యాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్లను రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురికి సీఎం ప్రోటో కాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించిన అత్తిలి ప్రవీణ్ సాయి అనే వ్యక్తి. హోం మిని స్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్తో ఉద్యో గాలు ఇప్పిస్తానంటూ మోసాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు బూసి ప్రవీణ్ సాయి వనస్థలిపురంలో నివాసం ఉంటు న్నాడు. ఆరు నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురిని మోసం చేసినట్లు అదే వ్యక్తి అరెస్టు కావడం కలకలం రేపుతోంది. తెలంగాణ సీఎం పబ్లిసిటీ సెల్ లో ప్రోటోకాల్ ఆఫీసర్ అవతారం ఎత్తి అరెస్ట్ అయ్యాడు. ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్ రీ అసైన్డ్ చేస్తానంటూ మోసాలు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురికి సీఎం ప్రోటోకాల్ నకిలీ స్టిక్కర్స్ ఇప్పించాడు బూసి ప్రవీణ్ సాయి అనే వ్యక్తి. హోం మినిస్టర్, మినిస్టర్స్ లెటర్ హెడ్స్ తో ఉద్యోగాలు ఇప్పిస్తా నంటూ మోసాలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితుడు బూసి ప్రవీణ్ సాయి. వన స్థలిపురంలో నివాసం ఉంటున్నాడు. ఆరు నెలల క్రితం ప్రభుత్వ పైరవీలు చేస్తూ పలువురికి మాయ మాటలు చెప్పి తప్పించుకొని తిరుగుతున్నాడు. యువకులకు, యువతులకు ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒరిజినల్ సర్టిఫికెట్లు, పాస్ పోర్టులు, లక్షల రూ. వసూలు చేసాడని, దళిత బంధు కూడా వచ్చేలా చేస్తానని, కమీషన్ ఇవ్వాలని అడ్వాన్స్ డబ్బులు తీసుకొని తప్పుడు మాటలు చెబు తూ దర్జాగా తిరుగుతున్నాడు. ఇతనిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలనీ చూస్తున్నామని భాధి తులు వాపోయారు.ప్రైవేట్ భూమిని ప్రభుత్వ భూమి అని పిర్యాదుదారుడి దగ్గర అడ్వాన్స్ తీసుకొని మోసం చేసిన కేసులో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసారని తెలిసి బాధితులు పోలీసులకు కలిసి తమగోడువెళ్ళబోసుకొని ఒరిజినల్ సర్టిఫికెట్లయినా ఇప్పించాలని వేడుకున్నారు.