- బిజెపి అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డి
బేగంపేట్ : సనత్నగర్ నియోజకవర్గంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఈసారి బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు ప్రజలంతా సిద్ధమయ్యారని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రిశిధర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం సనత్నగర్ నియోజకవర్గం బేగంపేట డివిజన్లోని భరణికం ప్లెక్స్,సింధి కాలనీతోపాటు ప్రశాంత్ అపార్టమెంట్,గ్రీన్ గెట్ అపార్టమెంట్లలో మర్రిశశిధర్రెడ్డి తన కార్యకర్తలతో కలసి ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు మంగళ వారతులు పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గడిచిన తొమ్మదిన్నర సంవత్సరాల కాలంలో బిఆర్ఎస్ పాలన పట్ల ప్రజలంతా పూర్తిగా విసుగు చెందన్నారు. నియోజకవర్గంలో ఏక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని, వాటిని పరిష్కారించాల్సిన మంత్రి తలసాని ఏ మాత్రం పట్టించుకొకుండా గాలికి వదిలేశరన్నారు. గత ఎన్నికలలో అనేక హామీలు ఇచ్చిన తలసాని ఏ ఒక్కటి కూడ అమలు చేయలేకపోయారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలంతా ఒక్కసారి అవకాశం ఇచ్చేందుకు సిద్ధమయ్యారన్నారు. తాను చేపాడుతున్న పాదయాత్రలో ప్రజలు ఎంతో సంతోషంగా స్వాగతం పలుకుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు షేక్ గౌస్, నీతినైన్, సత్యలక్ష్మి, మహేష్ తదితరులు పాల్గొన్నారు.