కంటోన్మెంట్ : కంటోన్మెంట్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి ఎల్ఐసి కాలనీ,సాయిబాబా హర్ట్స్ కు చెందిన బీ ఆర్ ఎస్,కాంగ్రెస్ నాయకులు బీ జె పీ లో చేరారు. బీజేపీ అభ్యర్ధి శ్రీ గణేష్, బోర్డ్ నామినేట్ సభ్యుడు రామకృష్ణలు కలిసి వారికి కండువా కప్పి బిజెపి లోకి ఆహ్వానించారు. ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ బిజెపి అభ్యర్థికి ఓటు వేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.కంటోన్మెంట్ అభివృద్ధి కావాలంటే బీజేపీ తోనే సాధ్యమని, కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని శ్రీగణేష్ స్పష్టం చేశారు.