హైదరాబాద్ : ఎన్నికల భద్రతా విధులు చేపట్టేందుకు 5 వేల మంది పోలీసులను పంపించాలని రాష్ట్రప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం, రాజస్థాన్, ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. మిజోరం, ఛత్తీస్?ఘడ్ ఎన్నికలు మంగళవారం జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణలో ఈ నెల 30వ తేది ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల భద్రతా విధులు చేపట్టేందుకు 5 వేల మంది పోలీసులను పంపాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాష్ట్రప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ విషయమై తమిళనాడు హోంగార్డు విభాగం డీజీపీ వన్నియపెరుమాళ్ అన్ని జిల్లాల ఎస్పీలకు పంపిన సర్క్యులర్లో, ఎన్నికల విధుల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పోలీసులను ఈ నెల 27వ తేది తెలంగాణకు పంపించాలని పేర్కొన్నారు.