Thursday, September 19, 2024
spot_img

అవకాశం ఇస్తే అభివృద్ధి చేస్తా

తప్పక చదవండి
  • ఎన్నికల ప్రచారంలో పాలమూరు బీజేపీ అభ్యర్థి మిథున్ రెడ్డి

మహబూబ్ నగర్ : భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మిథున్ రెడ్డిని ప్రధాని నరేంద్ర మోడీ మీపై నమ్మకంతో మీ ముందుకు పంపించాడు. తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తానని కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యిండు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. అవినీతి అక్రమాల ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి పంపించే సమయం వచ్చిందని అన్నారు. భారతీయ జనతా పార్టీ కేవలం జాతీయ వాదంతో దేశ రక్షణ కోసం పనిచేస్తుందని, ప్రధాని నరేంద్ర మోడీ పేదలకు గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఉచితంగా బియ్యము, రైతులకు ఆరువేల రూపాయలు కిసాన్ సామాన్ నిధి, గర్భిణీలకు 6000 కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. మహిళల ఆత్మగౌరవం కోసం టాయిలెట్స్ కట్టిస్తుంది. మీ వెంట ఉండి నితిన్ రెడ్డి సేవ చేస్తాడని మీకు నేను భరోసా కలిగిస్తున్నాను. పాలమూరులో జరుగుతున్న నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయాలంటే బిజెపి ప్రభుత్వం వస్తేనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు