Thursday, October 24, 2024
spot_img

కాంగ్రెస్‌ పాలనలోనే అభివృద్ధి

తప్పక చదవండి
  • చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి పామేన భీం భరత్‌

షాబాద్‌ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందుతుందిఅని చేవెళ్ల కాంగ్రెస్‌ పార్టీ అబిభ్యర్థి పామేన భీం భరత్‌ పేర్కొన్నారు. బుధవారం షాబాద్‌ మండల పరిధిలోని మాచన్‌ పల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మోముల సత్తిరెడ్డి కుమారుడు మోముల మాణిక్య రెడ్డి తన అనుచరు లతో కలిసి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వారికి కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న అభ్యర్థి పామేన భీం భరత్‌ , టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్‌ రెడ్డి ,టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శులు పీసారి సురేందర్‌ రెడ్డి , ఎన్‌ రాంరెడ్డి , మండల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులు కావలి చంద్ర శేఖర్‌ ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ …. ప్రజా శ్రేయస్సు కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని , ఆర్తి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలు తప్పక అమలు చేస్తుందన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రజలు పట్టం ఖాయమని ధీమా వ్యక్తం చేసారు. రాష్ట్రంలో అవినీతి పాలన వస్తుందని , కాంగ్రెస్‌ పేదలు, రైతుల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే మహిళలకు రూ. 500 గ్యాస్‌ సిలిండర్‌ ఉచితంగా ఆర్టీసీలో ప్రయాణం , రైతులకు రైతు బందు కింద ఎకరానికి ఏడాదికి రూ . 16000 , కౌలు రైతులకు రూ.12000 వంటి పథకాలు అమలు చేస్తామన్నారు. గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో బిఅర్‌ఎస్‌ ప్రభుత్వం పేద ప్రజానీకాన్ని మాటలతో మభ్య పెట్టి కాలం వెల్లదీస్తానన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సాధించి సాగు నీరు అందేలా చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పెంటారెడ్డి , యాదయ్య , నర్సింలు తదితరులున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు