Friday, September 20, 2024
spot_img

ఓర్వలేకనే మైనార్టీలపై బీజేపీ పార్టీ దాడులు

తప్పక చదవండి

గజ్వేల్‌ : పేదలకు,కుల మతాలకు అతీతంగా సేవ చేస్తున్న సంఘ సేవకురాలు, ఎస్‌.డి.ఎఫ్‌ సభ్యురాలు మహ్మద్‌ సుల్తాన ఉమర్‌ పై బీజేపీ పిచ్చి కూతలు కూయా డాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని, నిందితుడు బీజేపీ కార్యకర్త కొత్తిండ్ల సత్యంను వెంటనే అరెస్టు చేయాలని సోషల్‌ డెమోక్రాటిక్‌ ఫోరం రాష్ట్ర కన్వీనర్‌ ఆకునూరి మురళి డిమాండ్‌ చేశారు. శుక్రవారం మురళిని కలిసి సంఘటన వివరాలను సుల్తానా వివరించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతు బీజేపీ పార్టీ ఓర్వలేకనే మైనార్టీల పై దాడులు చేస్తుందన్నారు. భారతదేశంలో అన్ని మతాలు కులాల వారు జీవించే హక్కు ఉందని ముస్లిం, మైనార్టీలు కూడా ఈ దేశ ప్రజలే అని భారత దేశం ప్రజలందరిదన్నారు. ఏ మనిషి కూడా వ్యక్తిగతంగా దూషించడం,కించపరిచే హక్కు ఎవరికీ లేదన్నారు. ముఖ్యంగా బీజేపీ పార్టీ ముస్లిం మైనారిటీ, దళితుల పైన దాడులు, అరాచకాలు అనేకం చేస్తుందని వాటిని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిజెపికి స్థానం కల్పిస్తే ముస్లిం మైనార్టీ, దళిత బహుజనలకు రక్షణ లేకుండా పోతుందన్నారు. సామాజిక కార్యకర్తల పై విష ప్రచారం చేస్తుంటే చూస్తు ఊరుకొబొమని మురళి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం జెఎసి రాష్ట్ర నాయకులు ఖలీదా పర్వీన్‌,రచయిత స్కైబాబా, డిబిఎఫ్‌ జాతీయ కార్యదర్శి పి.శంకర్‌,రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు